ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday 17 April 2012

ఎంపీసీ విద్యార్థులూ... మీ కోసమే!


    ఎంపీసీ విద్యార్థులు ఒక్కొక్క ప్రవేశపరీక్షను పూర్తి చేసుకోవటంలో నిమగ్నమై ఉన్నారు. ఐఐటీ- జేఈఈ రాసిన అనుభవ సారాన్ని మిగతా పరీక్షలకు ఎలా అన్వయించుకోవాలి? పకడ్బందీగా ఏ విధంగా సన్నద్ధం కావాలి? పరిశీలిద్దాం!
త నాలుగైదు సంవత్సరాల పేపర్లతో పోలిస్తే ఉదయం జరిగిన ఐఐటీ-జేఈఈ పేపరు- 1 సులభంగా ఉంది. కానీ, మధ్యాహ్నం జరిగిన పేపరు - II ని అభ్యర్థులు క్లిష్టంగా భావించారు. దీంతో ఈ పోటీలో ఎక్కడ ఉంటామో అనే ఒక సందిగ్ధావస్థలో పడిపోయారు.

మొదటి పేపరు బాగా సులభంగా ఉంది కాబట్టి జేఈఈలో మరీ ఇంత సులభమైన ప్రశ్నలు ఇవ్వరని ఎక్కువగా ఆలోచించి కొన్ని తప్పులు చేశారు. అదేవిధంగా పేపరు - II బాగా క్లిష్టంగా ఉండటంతో అక్కడ కూడా అధికంగానే తప్పులు చేశారు.

ఈ పోటీ పరీక్షలన్నిటిలో ర్యాంకు సాపేక్షంగానే ఉంటుంది. పరీక్ష ఏ విధంగా ఉన్నా అభ్యర్థి వాటిని తీసుకునే పద్ధతి ఒకే విధంగా ఉండాలి. అప్పుడు ఇంకా జరగబోయే ఏఐఈఈఈ, ఐశాట్‌, బిట్‌శాట్‌ లాంటి పరీక్షల్లో కూడా అనుకొన్న ర్యాంకు సాధించే అవకాశం ఉంటుంది.

1. ప్రశ్న సులభంగా ఉంటే దానిని విపరీత అర్థాలు తీసి తప్పు జవాబులు గుర్తించకూడదు. ఉదా. భౌతికశాస్త్రంలో ఫిజికల్‌ ఆప్టిక్స్‌లో మొదటి పేపరులో ఇచ్చిన ప్రశ్న సాధారణ విద్యార్థి కూడా చాలా సులభంగా చేయగలది. దానిని అంత సులభంగా ఇవ్వరు, ఎక్కడో ఏదో మెలిక ఉంటుందని చాలామంది తప్పుగా గుర్తించారు.

అదేవిధంగా అకర్బన రసాయన శాస్త్రంలో పాఠ్యపుస్తకంలోని వ్యాఖ్యలను యథాతథంగా ఇచ్చినప్పటికీ చాలామంది తప్పు గుర్తించారు.

2. ఒక్కోసారి పేపరు కష్టంగా ఉందని అనిపించవచ్చు. 'ఇది సాపేక్ష పరీక్ష కాబట్టి మిగిలిన విద్యార్థుల కంటే ఒక ప్రశ్న అదనంగా చేయగలిగినా సీటు సాధించినట్లే' అనే దృక్పథంతో ఆలోచించాలి. ఇలా చేస్తే తప్పకుండా మంచి ర్యాంకు సాధించుకోవచ్చు.

ముందుగానే 'కటాఫ్‌' ప్రకటన
ఐఐటీ-జేఈఈ ప్రారంభమయిన తర్వాత ఫలితాల ముందే కటాఫ్‌ ప్రకటించడం అనేది తొలిసారి ఈ ఏడాదే జరిగింది. జనరల్‌ కేటగిరీలో సబ్జెక్టు కటాఫ్‌ 10 శాతంగా, మొత్తం కటాఫ్‌ మార్కులు 35 శాతంగా నిర్ణయించారు. ఓబీసీలో అయితే జనరల్‌ కేటగిరిలో 90 మార్కులు కటాఫ్‌గా, ఎస్‌.సి./ఎస్‌.టి./వికలాంగుల కేటగిరీ అయితే జనరల్‌ కేటగిరీ కటాఫ్‌లో 50 శాతం మార్కులు వీరి కటాఫ్‌గా ప్రకటించారు.



ప్రతి సబ్జెక్టులో 136 మార్కుల చొప్పున మొత్తం రెండు పేపర్లలో కలిపి 408 మార్కులకు పరీక్ష జరిగింది. ఈ కటాఫ్‌ మార్కుల పైన వచ్చిన ప్రతి అభ్యర్థికీ ర్యాంకు వస్తుంది. కానీ ఐఐటీలలో సీటు సాధించుకునే ర్యాంకు అంటే మాత్రం జనరల్‌ కేటగిరీలో 170 మార్కులపైనే సాధించవలసి ఉంటుంది.

ఏ మార్కుకు ఏ ర్యాంకు?
ఐఐటీ-జేఈఈలో సుమారుగా ఏ మార్కుకు ఏ ర్యాంకు వచ్చే అవకాశం ఉందో ఓ అంచనా ఇక్కడ చూద్దాం. ఇది కేవలం విద్యార్థి అవగాహన కోసమే కానీ కచ్చితమైన నిర్థారణ కాదు.



ఈ విశ్లేషణలో అర్థం చేసుకోవలసింది- పేపరు సులభంగా ఉంటే సీటు సాధించుకోవడానికి సాధించవలసిన మార్కు పెరుగుతుంది. పేపరు క్లిష్టంగా ఉంటే ఆ మార్కు తగ్గుతుంది. కానీ సాపేక్షంగా విద్యార్థి స్థాయి మారదు. ఈ విషయం అర్థం చేసుకుని పరీక్ష కాల వ్యవధిలో ఒక అవగాహనతో తెలిసిన ప్రతి ప్రశ్నకూ తప్పు లేకుండా సమాధానాలు గుర్తించగలగాలి. అప్పుడు పరీక్ష ఏదయినా కచ్చితంగా నెగ్గినట్లే!

ఏఐఈఈఈ సంగతి?
ఏఐఈఈఈ ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ 29నే కాబట్టి ఈ మిగిలిన పది రోజుల్లో కొత్త అంశాలను చదవడానికి ప్రాముఖ్యం ఇవ్వకూడదు. వీలైనన్ని నమూనా గ్రాండ్‌ టెస్టులు రాస్తుండాలి. ప్రతి పరీక్షలో చేసిన తప్పులు విశ్లేషించుకోవాలి.

ఈ పరీక్ష రాసే ప్రతి ఒక్కరూ మనసులో ఉంచుకోవాల్సిన అంశం- ప్రశ్నపత్రంలో అన్ని ప్రశ్నలకూ జవాబులు రాయాల్సిన అవసరం లేదు. నేర్చుకున్న అంశాలను తప్పు లేకుండా సక్రమంగా గుర్తించగలిగితే సరిపోతుంది.

*  అధికశాతం రెండో సంవత్సర సిలబస్‌లోనే ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అందుకే ద్వితీయ సంవత్సర సిలబస్‌కు సమయం ఎక్కువ కేటాయించుకుంటే మేలు.
*  ఆన్‌లైన్‌లో పరీక్షకు దరఖాస్తు చేసివున్నట్లయితే వీలైనన్ని నమూనా పరీక్షలు కంప్యూటర్‌పై అభ్యాసం చేయాలి. 65 శాతం పైన మార్కులు సాధించగలిగితే మంచి ఎన్‌.ఐ.టి.లో సీటు సాధించినట్లే!


బిట్ శాట్ సంసిద్ధమయ్యే  తీరు తెలుసుకోవడానికి  ఈ వారం ఈనాడు ‘చదువు’ ఇంటర్నెట్ ఎడిషన్ చూడండి-    http://archives.eenadu.net/04-16-2012/Specialpages/chaduvu/chaduvuinner.aspx?qry=topstory1

No comments:

Post a Comment