ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Showing posts with label ఉపకార వేతనాలు. Show all posts
Showing posts with label ఉపకార వేతనాలు. Show all posts

Friday, 9 December 2011

టాటా మోటార్స్‌ స్కాలర్‌షిప్‌లు

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థ డబ్ల్యు.ఎల్‌.సి. సంయుక్తంగా పని ఆధారిత (వర్క్‌ బేస్డ్‌) స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి.

ఈ రెండు సంస్థలు కలిసి ఏర్పాటుచేసిన డబ్ల్యు.ఎల్‌.సి.ఐ. అండ్‌ టాటా మోటార్స్‌ అకాడమీ ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.

'సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఆటోమొబైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్‌' కోర్సులో భాగంగా వీటిని ఇస్తారు.

ఇంజినీరింగ్‌, డిప్లొమా కోర్సులు చేసిన విద్యార్థులకు ఈ కోర్సు, స్కాలర్‌షిప్‌ మంచి అవకాశం కల్పిస్తుంది. ఇతర గ్రాడ్యుయేట్లు కూడా అర్హులు. కోర్సు వ్యవధి 11 నెలలు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు టాటా మోటార్స్‌ అధీకృత డీలర్‌షిప్‌లలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.

ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌, కోల్‌కతా, నోయిడాలో శిక్షణ కేంద్రాలున్నాయి. శిక్షణ కాలంలో రూ.8000 - 10000 వరకు స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. శిక్షణ తర్వాత ఉద్యోగంలో ప్రారంభ వేతనం ఏడాదికి రూ.2 లక్షలకుపైగా ఉంటుంది.

డబ్ల్యు.ఎల్‌.సి.ఐ., టాటా మోటార్స్‌ ఆధ్వర్యంలో నాలుగు నెలలు శిక్షణ ఉంటుంది. తర్వాత 7 నెలలు టాటా మోటార్స్‌ కంపెనీ కేంద్రాల్లో ఆచరణాత్మక శిక్షణ ఇస్తారు. అభ్యర్థి తనకు దగ్గర్లోని టాటా మోటార్స్‌ కేంద్రంలో ఈ శిక్షణ తీసుకోవచ్చు.

www.careers-tatamotorsdealers.com వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

చివరితేదీ 15 డిసెంబరు 2011.

Sunday, 27 November 2011

హిందూ - హితాచీ స్కాలర్‌షిప్‌లు

ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'ద హిందూ', జపాన్‌కు చెందిన హితాచీ లిమిటెడ్‌ కంపెనీ సంయుక్తంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి.

ఎంపికైన అభ్యర్థులకు టోక్యోలోని హితాచీ కంపెనీలో సాంకేతిక శిక్షణ లభిస్తుంది.

ఏటా ముగ్గురు అభ్యర్థులకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌లను ఇస్తారు.

స్కాలర్‌షిప్‌ వ్యవధి ఆర్నెల్లు. జులై 2012 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది.

అభ్యర్థులకు ఇండస్ట్రియల్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ సిస్టమ్స్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, పవర్‌ సిస్టమ్స్‌లో శిక్షణ లభిస్తుంది. శిక్షణలో పర్యావరణ అంశాలు, ఇంధన పొదుపునకు ఉపయోగపడే టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌ కింద ప్రయాణ ఖర్చులతోపాటు వ్యక్తిగత ఖర్చులకుగాను ప్రతి నెలా కొంత మొత్తం లభిస్తుంది. అభ్యర్థుల వయసు 31 మార్చి 2012 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. బీఈ / బీటెక్‌ లేదా బీఎస్సీ (ఇంజినీరింగ్‌) పూర్తి చేసుండాలి. శిక్షణకు ఎంచుకున్న అంశాలకు సంబంధించిన కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంటే ప్రాధాన్యం లభిస్తుంది. కనీసం ఏడాది అనుభవం అవసరం.

* దరఖాస్తులు అన్ని హిందూ కార్యాలయాల్లో లభిస్తాయి. మన రాష్ట్రంలో హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడలోని ఆఫీసుల్లో దరఖాస్తులు పొందవచ్చు.

హిందూ వెబ్‌సైట్‌  నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తులను 'The Hindu, 859 & 860, Anna Salai, Chennai - 600002' చిరునామాకు పంపించాలి.

చివరితేదీ 31 డిసెంబరు 2011.

Thursday, 17 November 2011

ఐఐటీల్లో చదవడానికి స్కాలర్‌షిప్‌లు

 
కార్పొరేట్‌ సంస్థలు, పేరున్న ఉన్నత విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహించే కోర్సుల ద్వారా విద్యార్థులకు చాలా ప్రయోజనం ఉంటుంది. కంపెనీలకు అవసరమైన సామర్థ్యాలను అందించడంలో ఇలాంటి కోర్సులు ముందువరుసలో ఉంటాయి.

ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ లార్సెన్‌ అండ్‌ టొబ్రొ (ఎల్‌ అండ్‌ టి) ఐఐటీల సహకారంతో ఎం.టెక్‌. కోర్సులను అందిస్తోంది. 'ఎల్‌ అండ్‌ టి బిల్డ్‌ ఇండియా స్కాలర్‌షిప్‌' పేరుతో విద్యార్థులకు మంచి శిక్షణ, తర్వాత ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది.

ఇంజినీరింగ్‌ చదువుతోన్న విద్యార్థులకు ఎల్‌ అండ్‌ టి స్కాలర్‌షిప్‌లు అద్భుతమైన అవకాశం.

సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా ఢిల్లీ, చెన్నైల్లోని ఐఐటీల్లో ఎం.టెక్‌. (కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సు చేయవచ్చు. ఇది రెండేళ్ల కోర్సు. ఏటా 40 మందిని ఎంపిక చేస్తారు.

కోర్సు జులై 2012 నుంచి ప్రారంభం కానుంది.

కోర్సు కాలం మొత్తం (రెండేళ్లు) నెలకు రూ.9000 చొప్పున స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. 2012లో బీఈ లేదా బీటెక్‌ (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) పూర్తిచేయనున్న అభ్యర్థులు మాత్రమే అర్హులు. కనీసం 65 శాతం మార్కులుండాలి. వయసు 23 ఏళ్లకు మించకూడదు.

రాత పరీక్షలు, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సంబంధిత ఐఐటీ, ఎల్‌ అండ్‌ టి సంయుక్తంగా వీటిని నిర్వహిస్తాయి. ఎల్‌ అండ్‌ టి సహకారంతో ఐఐటీలు ఈ కోర్సును రూపొందించాయి. ఎంపికైన అభ్యర్థులు కనీసం ఐదేళ్లు కంపెనీలో పనిచేయాలి.

ఈ స్కాలర్‌షిప్‌లకు అభ్యర్థుల కోసం ఎల్‌ అండ్‌ టి దాదాపు 100 ఇంజినీరింగ్‌ కాలేజీలకు సమాచారం పంపిస్తుంది. ఈ జాబితాలోలేని కాలేజీలకు చెందిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎల్‌ అండ్‌ టి వెబ్ సైట్  ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. చివరితేదీ 25 నవంబరు 2011

Sunday, 23 October 2011

ఉన్నతవిద్యకు సీబీఎస్ఈ ఉపకారం!

విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించి   ఉపయోగపడే సమాచారంతో ఈనాడు  హైదరాబాద్ మినీ ఇవాళ ఓ కథనం ప్రచురించింది.

మిగిలిన ప్రాంత పాఠకుల కోసం ఆ కథనం యథాతథంగా అందిస్తున్నాం!

Tuesday, 13 September 2011

డిగ్రీ, పీజీ విద్యార్థులకు సెంట్రల్‌ స్కాలర్‌షిప్‌లు

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రాడ్యుయేషన్‌, పీజీ కోర్సులు చేస్తున్న అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌లను ప్రవేశ పెట్టింది.

'సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ ఆఫ్‌ స్కాలర్‌షిప్స్‌ ఫర్‌ కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌' పేరుతో వీటిని అమలుచేస్తోంది.

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యాబోర్డులకు వీటిని కేటాయిస్తుంది. 18-25 ఏళ్ల మధ్య గల జనాభాను దృష్టిలో ఉంచుకొని ఆయా బోర్డులకు స్కాలర్‌షిప్‌ల సంఖ్యను నిర్ణయిస్తుంది.

మొత్తం మీద ఈ పథకం ద్వారా జాతీయ స్థాయిలో 82 వేల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించనుంది.

మొత్తం స్కాలర్‌షిప్‌లలో సగం అమ్మాయిలకు కేటాయిస్తారు. సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌ సబ్జెక్టులకు 3:2:1 నిష్పత్తిలో విభజిస్తారు.

కనీసం 80 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ / +2 ఉత్తీర్ణులైనవారు వీటికి అర్హులు. మార్చి 2011కు ముందు ఇంటర్మీడియట్‌ / 10+2 ఉత్తీర్ణులైనవారు అర్హులు కాదు. అభ్యర్థులు 2011-12లో డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సులో చేరి ఉండాలి.

ఎంపికైన విద్యార్థులకు.... 
* డిగ్రీలో నెలకు రూ.1000 చొప్పున స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. 
* పీజీ కోర్సులకు నెలకు రూ.2000 లభిస్తుంది. 

మొత్తం స్కాలర్‌షిప్‌ వ్యవధి ఐదేళ్లు. డిగ్రీ మూడేళ్లు, పీజీ రెండేళ్లు స్కాలర్‌షిప్‌ పొందవచ్చు. ఒక విద్యాసంవత్సరంలో పదినెలలు స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.

ఎంపిక ఇంటర్మీడియట్‌ తర్వాత డిగ్రీ స్థాయిలో మాత్రమే జరుగుతుంది. డిగ్రీ పూర్తిచేశాక పీజీ కోర్సులకు స్కాలర్‌షిప్‌ దానంతటదే రెన్యువల్‌ అవుతుంది. ప్రొఫెషనల్‌ కోర్సులకు కూడా ఇవి వరిస్తాయి. ప్రభుత్వం గతంలో అమలుచేసిన నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ను మెరుగుపరచి రెండేళ్ల కిందట ఈ కొత్త స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు.

అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4.5 లక్షలకు మించరాదు. ఈ స్కీమ్‌ కింద ఆంధ్రప్రదేశ్‌కు 6097 స్కాలర్‌షిప్‌లు లభిస్తాయి.

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ చదివిన విద్యార్థులకు సైన్స్‌/ కామర్స్‌/ ఆర్ట్స్‌ స్ట్రీమ్‌లలో కటాఫ్‌లు (జనరల్‌ అభ్యర్థులకు) కింది విధంగా నిర్ణయించారు.
* సైన్స్‌ స్ట్రీమ్‌: అబ్బాయిలకు 967 మార్కులు, అమ్మాయిలకు 969  మార్కులు.
* కామర్స్‌ స్ట్రీమ్‌: అబ్బాయిలకు 882 మార్కులు, అమ్మాయిలకు 883 మార్కులు.
* హ్యుమానిటీస్‌ స్ట్రీమ్‌: అబ్బాయిలకు 690 మార్కులు, అమ్మాయిలకు 714 మార్కులు.

ఓబీసీ విద్యార్థులకు పరిగణనలోకి తీసుకునే కటాఫ్‌లు...
* సైన్స్‌ స్ట్రీమ్‌:  అబ్బాయిలకు 956 మార్కులు, అమ్మాయిలకు కూడా 956 మార్కులు.
* కామర్స్‌ స్ట్రీమ్‌:  అబ్బాయిలకు 824 మార్కులు, అమ్మాయిలకు 827 మార్కులు. 
* హ్యుమానిటీస్‌ స్ట్రీమ్‌: అబ్బాయిలకు 632 మార్కులు, అమ్మాయిలకు 654  మార్కులు

ఇంటర్మీడియట్‌లో మార్కుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థుల తాత్కాలిక జాబితాను ఆయా కాలేజీలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పంపిస్తుంది. విద్యార్థులు తమ తమ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపల్‌ వద్ద నుంచి సంబంధిత దరఖాస్తులను పొందవచ్చు.

బీఐఈఏపీ వెబ్‌సైట్‌ నుంచి కూడా దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఈ దరఖాస్తులను అన్ని వివరాలతో డిగ్రీ/ ప్రొఫెషనల్‌ కాలేజీల ద్వారా 'సెక్రటరీ, బీఐఈ, ఏపీ, నాంపల్లి, హైదరాబాద్‌' చిరునామాకు పంపించాలి.

ఇతర అభ్యర్థులు +2కు సంబంధించిన తమ బోర్డులను సంప్రదించాలి.

* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 30 సెప్టెంబరు 2011.
       

Sunday, 4 September 2011

ఫెలోషిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ) ఆధ్వర్యంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కమ్యూనికేషన్‌ (ఎన్‌సీఎస్‌టీసీ) పనిచేస్తోంది. 
 ఇది రజత్‌ జయంతి విజ్ఞాన్‌ సంచారక్‌ ఫెలోషిప్‌ (ఆర్‌జేవీఎస్‌ఎఫ్‌)లను అందిస్తోంది.

సైన్స్‌, ఇంజినీరింగ్‌, మెడికల్‌ సైన్స్‌, అగ్రికల్చర్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మాస్‌ కమ్యూనికేషన్‌, తదితర సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, అంతకంటే పైస్థాయి కోర్సులు చేసిన అభ్యర్థులకు ఈ ఫెలోషిప్‌లు వర్తిస్తాయి.

మంచి అకడమిక్‌ రికార్డుతోపాటు డీఎస్‌టీ ఎంపిక చేసిన కొన్ని యూనివర్సిటీ, పరిశోధన, విద్యాసంస్థల్లో ఉన్నత కోర్సులు చేసేవారు, పరిశోధనలు చేసే అభ్యర్థులు ఈ ఫెలోషిప్‌లకు అర్హులు. సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లో పనిచేస్తోన్న స్వచ్ఛంద సంస్థలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలి.

ఆర్‌జేవీఎస్‌ఎఫ్‌ కింద జారీచేసే ఫెలోషిప్‌ల సంఖ్య 20.  ఫుల్‌టైమ్‌ కోర్సులు, పరిశోధనలు చేసేవారికి మాత్రమే వర్తిస్తాయి. ఫెలోషిప్‌ వ్యవధి ఏడాది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12000 (పీహెచ్‌డీ చేసినవారైతే రూ.16000) ఫెలోషిప్‌గా లభిస్తుంది.

*  అభ్యర్థులు డీఎస్‌టీ వెబ్‌సైట్‌  నుంచి  (ఇక్కడ క్లిక్ చేసి) లింకు ద్వారా దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

              పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ- 30 సెప్టెంబరు 2011.

Monday, 22 August 2011

డిగ్రీ చదవటానికి స్కాలర్ షిప్పులు


 భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘ఫౌండేషన్‌ ఫర్‌ అకడమిక్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ యాక్సెస్‌ (ఎఫ్‌ఏఈఏ)’ సంస్థ ఉంది. ఇది వివిధ  ఉపకార వేతనాలను (స్కాలర్‌షిప్‌లు) అందిస్తోంది.

 ప్రస్తుతం  షెడ్యూల్డ్‌ కులాల, షెడ్యూల్డ్‌ తెగల  అభ్యర్థులు వివిధ డిగ్రీ కోర్సులు చదవడానికి ఈ సంస్థ  ఆర్థిక సహాయం చేస్తోంది.

ఆర్ట్స్‌, కామర్స్‌, సైన్స్‌, మెడికల్‌, ఇంజినీరింగ్‌, ఇతర సాంకేతిక  సబ్జెక్టుల్లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కు  ఈ స్కాలర్‌షిప్‌లు వర్తిస్తాయి.

మొత్తం  స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 230.

ఇంటర్మీడియట్‌ / 10+2 ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీలో డిగ్రీ మొదటి ఏడాది కోర్సు చదువుతున్న అభ్యర్థులూ అర్హులే.

స్కాలర్‌షిప్‌ వ్యవధి గరిష్ఠంగా ఐదేళ్లు.  దీనిలో భాగంగా ట్యూషన్‌ ఫీజులు, హాస్టల్‌, పుస్తకాలు, ఇతర ఖర్చులను ఎఫ్‌ఏఈఏ భరిస్తుంది.

ఎఫ్‌ఏఈఏ కొన్ని విద్యాసంస్థలను సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా గుర్తించింది. వాటిలో చదివే విద్యార్థులకు అయ్యే అన్ని ఖర్చులనూ భరిస్తుంది.  ఫుల్‌టైమ్‌ కోర్సులకు మాత్రమే స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది.

* దరఖాస్తుల పరిశీలన తర్వాత ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలను అన్ని ప్రధాన నగరాల్లో నిర్వహిస్తారు.

* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తులను, ఫొటోతో సహా 'Foundation for Academic Excellence and Access (FAEA), C-25, Qutab Institutional Area, New Mehrauli Road, New Delhi- 110016'  చిరునామాకు పంపాలి.

* దరఖాస్తులు పంపటానికి  చివరి తేదీ: 27 ఆగస్టు 2011.

Thursday, 18 August 2011

8 వ తరగతి నుంచి పీహెచ్ డీ వరకూ ఆర్థిక సహాయం!


'నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌' (ఎన్‌టీఎస్‌ఈ) !  

ఇది జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశపరీక్ష.  దీని ద్వారా ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేసి, వారికి  ఉపకార వేతనాలు (స్కాలర్ షిప్పులు)  అందిస్తారు. 


ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) వీటిని అందిస్తుంది. 


 ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన అభ్యర్థులకు ఎనిమిదో తరగతి నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసేవరకూ ప్రత్యేక సబ్జెక్టుల్లో ఆర్థిక సహాయం లభిస్తుంది.  


సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, మేనేజ్‌మెంట్‌, లా కోర్సులు చదివే అందరికీ ఈ స్కీమ్‌ వర్తిస్తుంది.


ఎన్‌టీఎస్‌ఈ-  2012  ప్రకటన  వెలువడింది! 

8వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎంపిక పరీక్ష రాయడానికి అర్హులు.


* ఆంధ్రప్రదేశ్‌లో చదువుతున్న విద్యార్థులు 'డిప్యూటీ కమిషనర్‌, డైరెక్టర్‌ ఫర్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ కార్యాలయం, చాపెల్‌ రోడ్‌, ఆబిడ్స్‌, హైదరాబాద్‌' నుంచి దరఖాస్తులు పొందవచ్చు.


ఎన్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌  చూడండి.


* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 ఆగస్టు 2011.


‘చదువు’ లో ప్రచురించిన ఈ  కథనం లో పూర్తి వివరాలు చదవొచ్చు.