ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Saturday 31 December 2011

ఉద్యోగాలూ... ప్రకటనలూ!

హైదరాబాద్‌, న్యూస్‌టుడే:  
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌కమిషన్‌ శుక్రవారం మరో మూడు ప్రకటనలు జారీచేసింది.

వయ: పరిమితిని 18 నుంచి 34 సంవత్సరాలుగా నిర్ధరించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య ఓ ప్రకటన విడుదల చేశారు.


ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల భర్తీకి ప్రకటన
హైదరాబాద్‌, న్యూస్‌టుడే:  పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

కమ్యూనికేషన్స్‌ విభాగంలో 38 మంది ఎస్సైలు, పోలీసు ట్రాన్స్‌పోర్టు సంస్థలో 10 మంది ఎస్సైలు, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరోలో 29 మంది ఏఎస్సైల ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులు 2011 జులై 1 నాటికి 21 ఏళ్లు నిండి, 25 ఏళ్లలోపువారై ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు.

పూర్తి వివరాలు www.appolice.org వెబ్‌సైట్లో పొందుపరిచామని.. 2012 ఫిబ్రవరి 2 నుంచి మార్చి 15లోపు దరఖాస్తు చేయాలని సూచించారు.

Friday 30 December 2011

మరో పది ఉద్యోగ ప్రకటనలు... నేడు మరికొన్ని!

హైదరాబాద్‌-న్యూస్‌టుడే

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నుంచి గురువారం మరో పది ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటనలు వెలువడ్డాయి.

ఇందులో గ్రూపు-2 కింద 525 ఉద్యోగాలు భర్తీచేయనున్నారు. ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీలో 119, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీలో 406 పోస్టులను నింపుతారు. గ్రూపు-2కు ఒక్క పరీక్షనే నిర్వహించాలా... గ్రూపు-1 మాదిరిగా ప్రాథమిక, ప్రధాన పరీక్షలను నిర్వహించాలా? వద్దా అన్న అంశంపై అధికారిక నిర్ణయానికి. మరికొంత సమయం పట్టనుంది.

టెక్నికల్‌ అసిస్టెంట్స్‌ పోస్టులకు మినహా మిగిలిన వాటికి వయోపరిమితిని 18 నుంచి 34 సంవత్సరాలుగా నిర్ధారించారు. టెక్నికల్‌ అసిస్టెంట్స్‌ (పోలీసు రవాణ) పోస్టులకు దరఖాస్తుచేసే అభ్యర్థులకు 21 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని పేర్కొన్నారు.





ఇవికాకుండా శుక్రవారం మరికొన్ని ప్రకటనలు వెలువడనున్నాయి.

Thursday 29 December 2011

ఏపీపీఎస్ సీ ఉద్యోగ ప్రకటనల జోరు!

నేటివరకూ 19  ఉద్యోగ ప్రకటనల జారీ

ఇవాళ ఈనాడు లో వచ్చిన ఈ వార్త చూడండి.....

హైదరాబాద్‌, న్యూస్‌టుడే:  ఏపీపీఎస్సీ మరో 2602 పోస్టులతో ఏడు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది.

మంగళవారం 2805 పోస్టులతో పది ప్రకటనలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 132 లెక్చరర్ల పోస్టులు, 15 సహాయ అటవీ సంరక్షణ అధికారుల పోస్టులకు ప్రకటనలు జారీ చేశారు. రెండు రోజుల్లో మొత్తం 5,454 పోస్టులతో 19 ఉద్యోగ ప్రకటనలు జారీ అయ్యాయి.

బుధవారం జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలో గ్రూప్‌-4 పోస్టులు 2,146 ఉన్నాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
 
ఉద్యోగ ప్రకటనలతో పాటు దరఖాస్తు స్వీకరణ, రాత పరీక్షల తేదీలు ప్రకటించారు.

ప్రకటనలకు సంబంధించిన అర్హతలు, జోన్లవారీ ఖాళీల వివరాలు www.apspsc.gov.inలో లభిస్తాయి.




Wednesday 28 December 2011

సాధన చేస్తే... సాయుధ పోలీస్‌

కేంద్ర సాయుధ పోలీసు బలగాల నియామకానికి భారీ నోటిఫికేషన్‌ వెలువడింది. వివిధ విభాగాల్లో 49 వేల కానిస్టేబుల్‌ పోస్టుల నియామకానికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌.ఎస్‌.సి.) రంగం సిద్ధం చేసింది.

ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్‌, రైఫిల్‌మ్యాన్‌, తదితర ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ విభాగాల్లో ఈ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అన్ని పోస్టులను జనరల్‌ డ్యూటీ కేటగిరీలో భర్తీచేయనున్నారు.

అభ్యర్థులు సరైన ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే పదోతరగతితోనే కేంద్రప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు.

కేంద్ర సాయుధ బలగాల్లో పోస్టుల సంఖ్య నుంచి, నియామక ప్రక్రియ మొత్తాన్ని ఎస్‌ఎస్‌సీ పకడ్బందీగా రూపొందించింది. ఖాళీల నోటిఫికేషన్‌తోపాటు శారీరక సామర్థ్య పరీక్షల తేదీల దగ్గర్నుంచి, రాతపరీక్ష ప్రణాళిక, వైద్యపరీక్ష తేదీలు, తుది ఫలితాల వెల్లడి వరకు స్పష్టమైన నియామక ప్రక్రియను వెల్లడించడం అభ్యర్థులకు కలిసొచ్చే విషయం. ఈ విధానం ద్వారా అభ్యర్థులకు సమయం వృధా కాకుండా ఉంటుంది.

మొత్తం పోస్టుల్లో ఐదువేల పైచిలుకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. వీటిలో 80 శాతం పోస్టులను రాష్ట్ర అభ్యర్థులకు కేటాయిస్తారు.

శారీరక సామర్థ్య పరీక్ష పురుష అభ్యర్థులకు...
* లాంగ్‌జంప్‌: 11 ఫీట్లు (మూడు అవకాశాలు ఇస్తారు)
* హైజంప్‌: 3 1/2 ఫీట్లు (మూడు అవకాశాలు ఉంటాయి)

మహిళా అభ్యర్థులకు...
* లాంగ్‌ జంప్‌: 9 ఫీట్లు (మూడు అవకాశాలు ఉపయోగించుకోవచ్చు)
* హైజంప్‌: 3 ఫీట్లు (మూడు అవకాశాలు ఇస్తారు)
రాతపరీక్షలో 4 విభాగాలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 100. విభాగాల వారీగా ప్రశ్నలు...
* పార్ట్‌-ఎ (జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనింగ్‌): ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. 25 మార్కులు కేటాయించారు.
* పార్ట్‌- బి (జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌): ఇందులో కూడా 25 మార్కులకు 25 ప్రశ్నలుంటాయి.
* పార్ట్‌-సి (ఎలిమెంటరీ మేథమేటిక్స్‌): ఇందులో ప్రశ్నల సంఖ్య 25, కేటాయించిన మార్కులు 25.
* పార్ట్‌-డి (హిందీ లేదా ఇంగ్లిష్‌): అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లిష్‌ భాషను ఎంచుకోవచ్చు. గ్రామర్‌ అంశాలతోపాటు అభ్యర్థి భాషా సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. దీనికి 25 ప్రశ్నలకు 25 మార్కులు కేటాయించారు.

రాతపరీక్షను అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లిష్‌ భాషలో రాయవచ్చు. ఈ పరీక్షలో అడిగే ప్రశ్నలు పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి కాబట్టి అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. పరీక్ష మొత్తం ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు తెలుగు మీడియంలో ప్రిపరేషన్‌ కొనసాగించవచ్చు. ఇంగ్లిష్‌లో ప్రశ్నను అర్థం చేసుకొని సమాధానం గుర్తించగలిగితే సరిపోతుంది. పరీక్ష ఇంగ్లిష్‌ మీడియం కదా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

రాత పరీక్షకు ఎలా?
*జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనింగ్‌: ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నల ద్వారా అభ్యర్థి మానసిక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో పదాల మధ్య సంబంధాన్ని కనుక్కోవడం, దాన్ని విశ్లేషించడం, దిశలు, రక్తసంబంధాలు, వెన్‌చిత్రాలు, బొమ్మల పోలిక, నంబర్‌ సీరీస్‌, ర్యాంకింగ్‌; లాజికల్‌ రీజనింగ్‌లో... డాటా సఫిషియన్సీ, డెసిషన్‌ మేకింగ్‌, జడ్జిమెంట్‌, స్టేట్‌మెంట్‌-కంక్లూజన్స్‌, తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

*జనరల్‌ నాలెడ్జ్‌ - జనరల్‌ అవేర్‌నెస్‌:
ఇందులో కరెంట్‌ అఫైర్స్‌తోపాటు జనరల్‌ నాలెడ్జ్‌ మిలితమై ఉండే జనరల్‌ స్టడీస్‌లోని హిస్టరీ, జాగ్రఫీ నుంచి కొన్ని ప్రశ్నలు, పాలిటీ నుంచి భారత రాజ్యాంగం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని మార్పులు మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు జనరల్‌ నాలెడ్జ్‌ పరంగా అంతర్జాతీయ సంస్థలు, అవార్డులు, క్రీడలు, ప్రముఖ గ్రంథ రచయితలు, దేశాలు-రాజధానులు, భారతదేశంలో ప్రథములు, ఇండియన్‌ రైల్వేలు, విమానయానం, ప్రాచీన కట్టడాలు, ప్రముఖుల సమాధులు, ముఖ్యమైన తేదీలు, వివిధ మతాలు, దేశాల సరిహద్దులు, తదితర అంశాలను చదవాలి.

* చరిత్ర: భారత జాతీయోద్యమ చరిత్ర, వివిధ రాజవంశాలు, ఆయా రాజుల కాలంనాటి రాజకీయ పరిస్థితులు, కళలు, లిపులు, సాంస్కృతిక అంశాలు, జైన బౌద్ధమతాలు, సింధూ, ఆర్య నాగరికతలు అధ్యయనం చేయాలి.

* పాలిటీ: దీనిలో భారత రాజ్యాంగ చరిత్ర, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పాలనావ్యవస్థ, రాజ్యసభ, లోక్‌సభ, హైకోర్ట్‌, సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మంత్రిమండలి, గవర్నర్‌ మొదలైన అంశాలు చదువుకోవాలి.

* జాగ్రఫీ: ఇందులో అక్షాంశాలు, రేఖాంశాలు, శీతోష్ణస్థితి, నీటిపారుదల వ్యవస్థ, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు, అడవులు, వ్యవసాయం, తదితర అంశాలు ముఖ్యమైనవి.

* శాస్త్ర, సాంకేతిక రంగం: ఈ విభాగంలో అంతరిక్షం, రక్షణరంగం, అణుశక్తి, తదితర అంశాల నుంచి వర్తమాన విషయాలను అధ్యయనం చేయాలి. ఈ అంశాలతోపాటు పరీక్ష తేదీకి 4 నుంచి 5 నెలల ముందు జరిగిన వర్తమాన విషయాలు చూసుకోవాలి.

ప్రాథమిక గణితం
ఈ విభాగం నుంచి 25 మార్కులకు 25 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో సంఖ్యలు - వాటి ధర్మాలు, భాగాహారాలు, భిన్నాలు, కసాగు- గసాభా, శాతాలు, లాభనస్టాలు, కాలం - దూరం, రైళ్ళు, బారు వడ్డీ, చక్రవడ్డీ, క్యాలండర్‌, కాలం - పని, మొదలైన ప్రాథమిక స్థాయిలోని గణిత ప్రశ్నలు అడుగుతారు.

* ఇంగ్లిష్‌: ఇందులో కేవలం అభ్యర్థుల ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. Articles, Prepositions, Verbs, Helping Verbs, Tenses, Voice, Parts of Speechమొదలైన అంశాలతోపాటు Comprehension Passage లాంటి అంశాలు కూడా ప్రాక్టీస్‌ చేయడం మంచిది. ఈ విభాగం కోసం 8, 9, 10 తరగతులలోని గ్రామర్‌ అంశాలు చదివితే సరిపోతుంది.

అర్హతలు, వయోపరిమితి
జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు వయసు 1-8-2012 నాటికి 18 ఏళ్ల నుంచి 23 సంవత్సరాల లోపు ఉండాలి. గరిష్ఠ వయోపరిమితిలో ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. అభ్యర్థులు 4 జనవరి 2012 నాటికి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

శారీరక ప్రమాణాలు:
* పురుష అభ్యర్థులు 170 సెం.మీ. ఎత్తు ఉండాలి. మహిళా అభ్యర్థులు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.
* చాతీ (పురుష అభ్యర్థులకు మాత్రమే) గాలి పీల్చకుండా ఉన్నప్పుడు 80 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ.లు విస్తీర్ణం పెరగాలి.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు
* జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనింగ్‌, అర్థమెటిక్‌ విభాగాలు అభ్యర్థులకు చాలా ముఖ్యమైనవి. ఉద్యోగ సాధనలో ఈ విభాగాలే కీలకం కాబట్టి వీటి ప్రిపరేషన్‌కు అధికంగా సమయం కేటాయించడం తప్పనిసరి.
* అర్థమెటిక్‌ విభాగం కోసం 1 నుంచి 25 వరకు ఎక్కాలు, వర్గాలు, గుణకారాలు, భాగహారాలు తక్కువ సమయంలో చేసేటట్లు సాధన అవసరం.
* గతంలో ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ నిర్వహించిన వివిధ ప్రశ్నపత్రాలు సాధన చేయాలి.
* మౌలిక అంశాలు ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకుంటూ, ముఖ్యమైన గణిత ఫార్ములాలు ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ ఉపయోగించరాదో తెలుసుకోవాలి.
* ప్రాథమిక తరగతుల నుంచి అంశాలవారీగా (జాగ్రఫీ, చరిత్ర, పాలిటీ) పాఠ్యాంశాలను విభజించి సొంత నోట్సు తయారుచేసుకోవాలి.
* జీకే, కరెంట్‌ అఫైర్స్‌తోపాటు జనరల్‌ స్టడీస్‌లోని ప్రతి విభాగంలో ఆబ్జెక్టివ్‌ బిట్లను సాధన చేయడం మంచిది.
* రాతపరీక్ష పదో తరగతి స్థాయిలోనే ఉంటుంది కాబట్టి బేసిక్స్‌పై అధికంగా ప్రశ్నలు ఉంటాయి. పాఠశాల స్థాయి పుస్తకాలలోని అంశాలను బాగా చదవాలి.

శారీరక పరీక్షలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షల్లో లాంగ్‌ జంప్‌, హైజంప్‌ రెండూ క్లిష్టమైనవి. శ్రద్ధతో చేస్తే లాంగ్‌ జంప్‌ కోసం 15-20 రోజుల సాధన సరిపోతుంది.

* లాంగ్‌జంప్‌ కోసం: అభ్యర్థులు జంప్‌ చేసేటప్పుడు టేకాఫ్‌ బోర్డ్‌కు 10 నుంచి 20 అడుగుల దూరం తీసుకొని ప్రాక్టీస్‌ చేయాలి. అలా దూరం నుంచి పరుగెత్తుతూ రావడం వల్ల జంప్‌చేసే స్థాయి పెరుగుతుంది. ముందుగా దగ్గరగా స్టెప్స్‌ వేసుకుంటూ రన్నింగ్‌ చేస్తూ, టేకాఫ్‌ బోర్డ్‌ దగ్గరికి వచ్చే ముందు కాలి అంగల దూరం పెరగాలి. అభ్యర్థుల్లో ఒక్కొక్కరికి ఒక్కో కాలుపై పట్టు ఉంటుంది. కొందరికి కుడి కాలుపై, కొందరికి ఎడమకాలుపై పట్టు ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు సాధన చేయాలి.

* హైజంప్‌ కోసం: అభ్యర్థులు ముందు నుంచీ సెలక్షన్స్‌ కోసం నిర్ణయించిన ఎత్తును ప్రాక్టీస్‌ చేయకుండా, తక్కువ ఎత్తులో, అంటే ముందుగా 2 ఫీట్లు, 2 1/2 ఫీట్లు, 3 ఫీట్లు అలా ఎత్తును పెంచుకుంటూ జంప్‌ చేయాలి. హైజంప్‌ పోల్‌పై ఉంచే కర్రను జంప్‌ చేసినప్పుడు తాకగానే కర్ర పడిపోయే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. హైజంప్‌ చేసేటప్పుడు పోల్స్‌కు కనీసం 3 అడుగుల దూరం నుంచి జంప్‌ చేసేట్టుగా చూసుకోవాలి. హైజంప్‌లో ఉన్న మూడు పద్ధతుల్లో సీజరింగ్‌, బెల్లీరోలింగ్‌, స్ట్రెయిట్‌జంప్‌... వీటిలో ఏదో ఒకటి ఎంచుకొని సాధన చేయాలి.


దరఖాస్తు విధానం
అభ్యర్థులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ (ప్రింటెడ్‌ దరఖాస్తు ద్వారా) పద్ధతుల్లో దరఖాస్తు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే అభ్యర్థులు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా చలానా రూపంలో ఫీజు చెల్లించాలి. ఆఫ్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టాఫీస్‌ ద్వారా సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ ఫీ స్టాంప్స్‌ రూపంలో ఫీజు చెల్లించాలి.

* దరఖాస్తు ఫీజు, జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.50. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆఫ్‌లైన్‌ ద్వారా పూర్తిచేసిన ధరఖాస్తులను ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులు 'రీజనల్‌ డైరెక్టర్‌ (ఎస్‌ఆర్‌), స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, ఈవీకే సంపత్‌ బిల్డింగ్‌, సెకండ్‌ ఫ్టోర్‌, కాలేజ్‌ రోడ్‌ చెన్నై, తమిళనాడు- 600006' చిరునామాకు పంపించాలి. ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులకు హైదరాబాద్‌, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలున్నాయి.

* దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 4 జనవరి 2012.
* శారీరక సామర్థ్య పరీక్షలు: ఫిబ్రవరి- మార్చిలో
* రాతపరీక్ష తేదీ: 22-4-2012
* వైద్యపరీక్షలు: జూన్‌-జులై
* తుది ఫలితాల వెల్లడి: 30-9-2012.
 
- మాల్యాద్రి.

Saturday 24 December 2011

ఐఐటీ మద్రాస్‌లో ఎం.ఎ.


ఇంజినీరింగ్‌కు ప్రసిద్ధిచెందిన ఐఐటీ మద్రాస్‌, అదే స్థాయి నాణ్యతతో హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌లో ఇంటెగ్రేటెడ్‌ కోర్సులను నిర్వహిస్తోంది.

ఈ కోర్సుల్లో ప్రవేశానికి 'హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌' (హెచ్‌ఎస్‌ఈఈ 2012) పేరుతో జాతీయస్థాయిలో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది.

ఇంటర్‌ డిసిప్లీనరీ స్వభావం గల ఈ కోర్సుల ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.

కోర్సుల వివరాలు...

*  ఇంటెగ్రేటెడ్‌ ఎం.ఎ. (ఇంగ్లిష్‌ స్టడీస్‌)
*  ఇంటెగ్రేటెడ్‌ ఎం.ఎ. (డెవలప్‌మెంట్‌ స్టడీస్‌)

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కోర్సులను ఐఐటీ మద్రాస్‌ రూపొందించింది. రెండు ప్రోగ్రామ్‌లలో ఎకాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, స్టాటిస్టిక్స్‌, మేథమేటిక్స్‌, ఐటీ, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో బేసిక్‌ కోర్సులు ఉంటాయి. ఫ్రెంచ్‌, జర్మన్‌ భాషలను అధ్యయనం చేస్తారు. మొదటి రెండేళ్లు రెండు ప్రోగ్రామ్‌ల అభ్యర్థులకు ఒకే సబ్జెక్టులు ఉంటాయి. మూడో ఏడాది నుంచి ఎంచుకున్న స్పెషలైజేషన్‌ల వారీగా అభ్యర్థులను విభజిస్తారు.
ఇవి రెండూ ఐదేళ్ల కోర్సులు.

ఒక్కో కోర్సులో 23 సీట్లు చొప్పున మొత్తం 46 సీట్లు ఉంటాయి. ట్యూషన్‌ ఫీజు సెమిస్టర్‌కు రూ.4500. హాస్టల్‌, ఇతర ఫీజులు సెమిస్టర్‌కు 15-16 వేల రూపాయల వరకు ఉంటాయి.

కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు విద్యారంగం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని కంపెనీలు, పరిశోధన సంస్థలు, ఎన్‌జీఓలు, ఇతర సంస్థల్లో ఉద్యోగ అవకాశాలుంటాయి.

పరీక్ష పద్ధతి
పరీక్ష వ్యవధి 3 గంటలు. పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్‌-1 ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పరీక్ష. దీని వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, ఎనలిటికల్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌ (స్వాతంత్య్రానంతరం భారత ఆర్థిక వ్యవస్థ, భారతీయ సమాజం, రెండో ప్రపంచ యుద్ధానంతరం సమకాలీన ప్రపంచ వ్యవహారాలు), ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఎకాలజీ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇందులో ఇంగ్లిష్‌, ఎనలిటికల్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీకి ఒక్కోదానికి 25 శాతం మార్కులు, జనరల్‌ స్టడీస్‌కు 50 శాతం మార్కులు కేటాయించారు.

* ఇంగ్లిష్‌లో రీడింగ్‌ స్కిల్స్‌, గ్రామర్‌, వొకాబ్యులరీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
* ఎనలిటికల్‌ ఎబిలిటీలో నంబర్స్‌, ఆల్జీబ్రా, హెచ్‌సీఎఫ్‌, ఎల్‌సీఎం, బేసిక్‌ స్టాటిస్టిక్స్‌, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌, ఎనలిటికల్‌ రీజనింగ్‌, లాజికల్‌ రీజనింగ్‌, బ్రెయిన్‌టీజర్స్‌, తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
* పార్ట్‌-2లో వ్యాస రచన ఉంటుంది. దీని వ్యవధి అరగంట. ఇందులో కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన అంశాలపై వ్యాసం రాయాలి.

దరఖాస్తు విధానం
హెచ్‌ఎస్‌ఈఈ రాయడానికి ఇంటర్మీడియట్‌ / 10+2 ప్రధాన అర్హత. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 60 శాతం మార్కులు అవసరం. చివరి సంవత్సరం పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అడ్మిషన్‌ సమయంలో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి. ఐఐటీ మద్రాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుంది. దరఖాస్తు ప్రక్రియ 20 డిసెంబరు 2011 నుంచి ప్రారంభమవుతుంది. పరీక్ష మనరాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే జరుగుతుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: 20 జనవరి 2012
* దరఖాస్తు ప్రింట్లు చేరడానికి చివరితేదీ: 31 జనవరి 2012
* హెచ్‌ఎస్‌ఈఈ 2012 తేదీ: 6 మే 2012
* ఫలితాల విడుదల: 4 జూన్‌ 2012.
   

ఆకర్షణీయం... ఐసీఐసీఐ ఎంబీఏ


ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ, ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ సంయుక్తంగా ఎంబీఏ (ఫైనాన్స్‌ అండ్‌ బ్యాంకింగ్‌) కోర్సును నిర్వహిస్తున్నాయి.

ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగం లభిస్తుంది. 'ఐసీఐసీఐ బిజినెస్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్‌' పేరుతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు.

బ్యాంకింగ్‌ రంగంలో ఉన్నత స్థాయి ప్రొఫెషనల్స్‌ను తయారుచేయడం దీని ప్రధాన లక్ష్యం.

కార్పొరేట్‌ రంగంలో వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న ప్రొఫెషనల్స్‌కు ఐసీఐసీఐ -ఎన్‌ఐఐటీ అందిస్తోన్న ఎంబీఏ మంచి అవకాశాలు కల్పిస్తోంది. ఆయిల్‌, గ్యాస్‌,ప ఎనర్జీ, పవర్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌, ఫార్మా, స్టీల్‌, ఏవియేషన్‌, టెలికాం, ఫైనాన్స్‌, టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌, అకౌంట్స్‌, తదితర రంగాల్లో పనిచేస్తోన్న ప్రొఫెషనల్స్‌ ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఉన్నత స్థాయి మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాలను చేజిక్కించుకోవచ్చు.

ఏడాదికి రూ.15 లక్షల ప్రారంభ వేతనంతో ఐసీఐసీఐ బ్యాంకు ఈ అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది. హోల్‌సేల్‌ బ్యాంకింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, గ్లోబల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, తదితర విభాగాల్లో వీరికి అవకాశాలుంటాయి.

కోర్సు స్వరూపం
కోర్సు వ్యవధి రెండేళ్లు. మొత్తం 8 టర్మ్‌లు ఉంటాయి. వీటిలో 1, 2 టర్మ్‌లు క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌, తర్వాతి రెండు (3, 4) టర్మ్‌లు ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. 5,6 టర్మ్‌లు క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌, 7,8 టర్మ్‌లలో సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఒక్కో టర్మ్‌ వ్యవధి మూడు నెలలు. అభ్యర్థి ఎంచుకున్న ఎలక్టివ్‌లను బట్టి కార్పొరేట్‌ బ్యాంకింగ్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఐటీలో శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక మేనేజర్‌ గ్రేడ్‌-2, అనుభవాన్ని బట్టి అంతకంటే ఉన్నత స్థాయిలో ఉద్యోగం పొందవచ్చు.

* కోర్సు ఫీజు రూ.4.5 లక్షలు. ఈ మొత్తాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ఏడాదికి 2.5 శాతం వడ్డీతో రుణంగా ఇస్తుంది. కోర్సుకాలంలో ఏమీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్సు పూర్తయ్యాక, ఉద్యోగంలో చేరిన దగ్గర్నుంచి 60 ఈఎంఐల రూపంలో రుణం తిరిగి చెల్లించాలి.

* కోర్సు కాలంలో నెలకు రూ.10000 స్టయిపెండ్‌ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకులో ఇంటర్న్‌షిప్‌ కాలంలో నెలకు రూ.50000 స్టయిపెండ్‌ ఇస్తారు. అభ్యర్థులు కనీసం మూడేళ్లు ఐసీఐసీఐ బ్యాంకులో తప్పనిసరిగా పనిచేయాలి. ఈమేరకు రూ.20 లక్షలకు బాండ్‌ సమర్పించాలి.

ఎంపిక, అర్హతలు
మొత్తం సీట్లు 120. ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎంట్రన్స్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, సైకోమెట్రిక్‌ ప్రొఫైలింగ్‌ లేదా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటాయి. ఎంట్రన్స్‌ టెస్ట్‌లో వెర్బల్‌ ఎబిలిటీ, న్యుమరికల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. గ్రూప్‌ డిస్కషన్‌లో ప్రధానంగా అభ్యర్థికి గల విశ్లేషణాత్మక, సమస్యా పరిష్కార సామర్థ్యాలను పరీక్షిస్తారు. కోర్సు ఏప్రిల్‌ 2012 నుంచి ప్రారంభమవుతుంది. శిక్షణ రాజస్థాన్‌లోని ఎన్‌ఐఐటీ యూనివర్సిటీలో ఉంటుంది.

సీఏ, ఇంజినీరింగ్‌, ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ప్రొఫెషనల్స్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ, ఫైనాన్స్‌, ఎకనమిక్స్‌, లా, కామర్స్‌, స్టాటిస్టిక్స్‌ గ్రాడ్యుయేట్లు కూడా అర్హులు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఫార్మా, స్టీల్‌, ఇన్‌ఫ్రా, సాఫ్ట్‌వేర్‌, ఏవియేషన్‌, పవర్‌, టెలికాం, ఫైనాన్స్‌, పెట్రోలియం, మాన్యుఫ్యాక్చరింగ్‌, తదితర రంగాల్లో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్‌ వరకు అన్ని కోర్సుల్లో కనీసం 60 శాతం మార్కులుండాలి.

వయసు 15 ఏప్రిల్‌ 2012 నాటికి 30 ఏళ్లకు మించరాదు.

* అభ్యర్థులు ఐసీఐసీఐ కెరీర్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు మనరాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 1 జనవరి 2012.

Thursday 22 December 2011

నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్‌ కోర్సులు

సృజనాత్మకత, నవ్యతకు ప్రాధాన్యం ఇచ్చే కెరియర్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ.

మారుతోన్న సామాజిక ధోరణులను, జీవన విధానాలను అధ్యయనం చేస్తూ, వినియోగదారుల మనోభావాలకు తగిన రీతిలో దుస్తులను డిజైన్‌ చేయడం ఈ కెరియర్‌లో చాలా కీలకం.

ఈ అంశాల్లో పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటైన సంస్థ... నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌).

ఫ్యాషన్‌ సంబంధిత అంశాల్లో గ్రాడ్యుయేషన్‌ నుంచి పీహెచ్‌డీ వరకు వివిధ రకాల కోర్సులను నిఫ్ట్‌ అందిస్తోంది. రానున్న విద్యాసంవత్సరానికి నిఫ్ట్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ వెలువడింది.

హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా నిఫ్ట్‌కు 15 కేంద్రాలున్నాయి.

వీటిలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌, టెక్నాలజీ, ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌, తదితర విభిన్న కోర్సులను అందిస్తున్నారు. సమాజంలోని వివిధ రకాల వ్యక్తుల జీవన విధానాలను, ఫ్యాషన్‌ అభిరుచులను అర్థం చేసుకుంటూ, వారికి తగిన విధంగా దుస్తులను, ఇతర సౌకర్యాలను డిజైన్‌ చేయడం ఫ్యాషన్‌ కోర్సుల్లో ముఖ్యమైన అంశం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న నిఫ్ట్‌, ఫ్యాషన్‌ సంబంధిత కోర్సులకు 'సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌'గా పేరుపొందింది. పరిశ్రమల నిపుణుల, ఇతర ప్రముఖ సంస్థల మదింపు ఆధారంగా నిఫ్ట్‌ గత ఏడాది అన్ని కోర్సులను పూర్తిస్థాయిలో సంస్కరించడం విశేషం.
డ్యుయల్‌ డిగ్రీ కూడా...
అమెరికాలోని ఫ్యాషన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎఫ్‌ఐటీ)తో కలిసి నిఫ్ట్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో డ్యుయల్‌ డిగ్రీని అందిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనికి ఎంపికైన అభ్యర్థులు నిఫ్ట్‌ కేంద్రంలో మొదటి రెండేళ్లు, ఎఫ్‌ఐటీలో మూడో ఏడాది శిక్షణ తీసుకోవాలి. తర్వాత మళ్లీ నిఫ్ట్‌లో కోర్సు కొనసాగించాలి. నిఫ్ట్‌ కేంద్రాల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులు చేస్తోన్న అభ్యర్థుల నుంచి ఈ కోర్సుకు అర్హులను ఎంపిక చేస్తారు. నిఫ్ట్‌కు లండన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ (యూకే), క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ (ఆస్ట్రేలియా), కొలరాడో స్టేట్‌ యూనివర్సిటీ (అమెరికా), రాయల్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ (నెదర్లాండ్స్‌), ఫిలడెల్ఫియా యూనివర్సిటీ (అమెరికా), తదితర సంస్థలతో విద్యాపరమైన సంబంధాలు ఉన్నాయి.

కోర్సులు, సీట్ల వివరాలు...
* బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌: వ్యవధి నాలుగేళ్లు. అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లు... ఫ్యాషన్‌ డిజైన్‌, లెదర్‌ డిజైన్‌, యాక్సెసరీ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌, నిట్‌వేర్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌. ఏ గ్రూప్‌తోనైనా ఇంటర్మీడియట్‌ చదివిన విద్యార్థులు అర్హులు.

* బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ: కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఇందులో అప్పారల్‌ ప్రొడక్షన్‌ స్పెషలైజేషన్‌ మాత్రమే ఉంది. మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలతో ఇంటర్మీడియట్‌ చదివినవారు అర్హులు.

* మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌: ఇవి అడ్వాన్స్‌డ్‌ కోర్సులు. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉన్న అభ్యర్థులు అర్హులు. నిఫ్ట్‌ లేదా ఎన్‌ఐడీలో డిప్లొమా చదివినవారు కూడా దరఖాస్తు చేయవచ్చు.

* మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ: ఏ స్పెషలైజేషన్‌తోనైనా బీఈ లేదా బీటెక్‌ చదివినవారు అర్హులు. నిఫ్ట్‌లో బీఎఫ్‌టెక్‌ చేసినవారు కూడా అర్హులు.

నిఫ్ట్‌ కేంద్రాలు గల ప్రదేశాలు: హైదరాబాద్‌, బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, చెన్నై, గాంధీనగర్‌, జోధ్‌పూర్‌, కాంగ్రా, కానూర్‌, కోల్‌కతా, ముంబయి, న్యూఢిల్లీ, పాట్నా, రాయబరేలీ, షిల్లాంగ్‌. అన్ని కేంద్రాల్లో కలిపి వివిధ కోర్సుల్లో 2180 సీట్లున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంలో 214 సీట్లున్నాయి.

అన్ని కేంద్రాల్లో కలిపి కోర్సులవారీగా అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు...

బ్యాచిలర్‌ కోర్సులు...
* ఫ్యాషన్‌ డిజైన్‌ (FD): 330
* లెదర్‌ డిజైన్‌ (LD): 120
* యాక్సెసరీ డిజైన్‌ (AD): 240
* టెక్స్‌టైల్‌ డిజైన్‌ (TD): 330
* నిట్‌వేర్‌ డిజైన్‌ (KD): 210
* ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌ (FC): 150
* అప్పారెల్‌ ప్రొడక్షన్‌ (AP): 323

మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌లు...
* మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ (MD): 60
* మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ (MFM): 324
* మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (M.FT): 93


ఎంపిక, దరఖాస్తు విధానం
జాతీయ స్థాయిలో నిర్వహించే రాతపరీక్ష (జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టుకు సంబంధించిన ఆప్టిట్యూడ్‌, సామర్థ్యాలు, తెలివితేటలను పరీక్షిస్తారు. రాతపరీక్ష ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటుంది. ప్రశ్నల సంఖ్య ఏటా మారుతుంటోంది. నెగటివ్‌ మార్కులుంటాయి. రాత పరీక్షను 12 ఫిబ్రవరి, 2012న నిర్వహించనున్నారు. మనరాష్ట్రంలో హైదరాబాద్‌, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలున్నాయి. మాస్టర్స్‌ కోర్సులకు రాతపరీక్షతోపాటు గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. రాతపరీక్షలో కింది విభాగాలుంటాయి...

* క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ
* కమ్యూనికేషన్‌ ఎబిలిటీ
* ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌
* ఎనలిటికల్‌ ఎబిలిటీ
* జనరల్‌ నాలెడ్జ్‌ - కరెంట్‌ అఫైర్స్‌


నిఫ్ట్‌ దరఖాస్తులు ఐడీబీఐ, యాక్సిస్‌ బ్యాంకు శాఖల్లో లభిస్తాయి.
నిఫ్ట్‌ వెబ్‌సైట్‌ నుంచి కూడా దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 10 జనవరి 2012.
జూన్‌-జులైలో కౌన్సెలింగ్‌ ఉంటుంది.

Tuesday 20 December 2011

ఇంజినీర్లూ... స్వాగతం!

'సాఫ్ట్‌వేర్‌, ఇతర ప్రైవేటు ఉద్యోగాల కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమే మేలు' అనుకునే ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు రాష్ట్ర విద్యుత్‌సంస్థ తాజా ఉద్యోగ ప్రకటన వరంలాంటిది.

ఏపీ జెన్‌కోలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయటానికి నోటిఫికేషన్‌ విడుదలయింది. ఏపీ ట్రాన్స్‌కో నుంచి నోటిఫికేషన్‌ రాబోతోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బి.ఇ./బి.టెక్‌/ ఎ.ఎం.ఐ.ఇ.లలో ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచిల వారికి ఇదో చక్కని అవకాశం.

రాష్ట్రంలో అతి పెద్ద విద్యుదుత్పాదనతో భారతదేశంలో రెండో అతి పెద్ద హైడల్‌ సామర్థ్యాన్ని కలిగిన సంస్థ ఏపీ జెన్‌కో. ఈ సంస్థ  ట్రెయినీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగ నియామకాలకు ప్రకటన జారీ చేసింది. ఇందులో 61 ఖాళీలు పరిమిత నియామకానికి (limited recruitment) సంబంధించినవి. 350 ఖాళీలు సాధారణ నియామకానికి (general recruitment ) సంబంధించినవి.

వెరసి మొత్తం 411 పోస్టులను భర్తీ చేయబోతున్నారు.

2011 డిసెంబరు 1 నాటికి అభ్యర్థుల వయసు 34 సంవత్సరాలు మించివుండకూడదు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయః పరిమితిలో ఐదేళ్ళ సడలింపు ఇస్తారు. అంగవైకల్యం ఉన్న అభ్యర్థులకు పదేళ్ళ సడలింపు ఉంటుంది.

జీతం స్కేలు: రూ.23115-955-25025-1115-30600-1280-35720

ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలలో ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా తమ దరఖాస్తులను పూరించి పంపించాలి. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం- ఇంటర్‌నెట్‌పై దరఖాస్తులను పంపే విధానంపై అవగాహన లేనివారు స్నేహితుల, లేదా ఈ ప్రక్రియపై అవగాహన ఉన్నవారి సహాయం తీసుకోవాలి.

ఎందుకంటే ఉద్యోగ దరఖాస్తుకు ఇది తొలిమెట్టు, అత్యంత కీలకఘట్టం. దరఖాస్తులో నింపే సమాచారంలో ఎలాంటి పొరపాట్లు దొర్లినా, మీ సర్టిఫికెట్ల సమాచారంతో ఆన్‌లైన్‌ సమాచారం సరిపోకపోయినా దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. తద్వారా ఉద్యోగావకాశం చేజారుతుంది. అందుకని ఇందులో ఎలాంటి నిర్లక్ష్యమూ పనికిరాదు.

దరఖాస్తు చేసేదెలా?
ఏపీ జెన్‌కోలో ట్రెయినీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేయగోరే అభ్యర్థులుhttp:// www.apgenco.gov.in వెబ్‌సైట్‌ లోకి లాగిన్‌ అయ్యి Apply Online పై క్లిక్‌ చేయాలి. లేదా నేరుగా http://apgenco.cgg.gov.in లోకి లాగిన్‌ అవడం ద్వారా నోటిఫికేషన్‌, దరఖాస్తు వివరాలను పొందవచ్చు. డిసెంబరు 20 నుంచి జనవరి 3 వరకూ ఆన్‌లైన్‌ దరఖాస్తు అందుబాటులో ఉంటుంది.

దరఖాస్తుదారుల్లో ఓసీ అభ్యర్థులు/ ఇతర రాష్ట్రాల అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సివుంటుంది. (దీనిలో రూ.350 పరీక్ష ఫీజు+ రూ.150 దరఖాస్తు రిజిస్ట్రేషన్‌ ఫీజు). బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, అంగవికలురు రూ.150 చెల్లించాలి. ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. జనవరి 3, 2012 మధ్యాహ్నం ఒంటిగంటలోపు ఈ ఫీజు చెల్లించాల్సివుంటుంది. భర్తీ చేసిన దరఖాస్తులు జనవరి 3, 2012 రాత్రి 11.59 గంటలలోపు పంపించవచ్చు.

ట్రెయినీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసే ఇంజినీరింగ్‌ అభ్యర్థులు సంబంధిత బ్రాంచిలలో డిసెంబరు 1, 2011 నాటికి విద్యార్హతను సాధించివుండాలి.

ఎంపిక విధానం
ఏపీ జెన్‌కో ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఈ పరీక్షను జనవరి 22న నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలో రెండు విభాగాలుంటాయి.

సెక్షన్‌ 'ఎ'లో 70 మార్కులకు కోర్‌ సబ్జెక్టుపై, సెక్షన్‌ 'బి'లో 30 మార్కులకు ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 2 గంటలు. వివిధ ఇంజినీరింగ్‌ బ్రాంచిలకు నిర్దేశించిన సిలబస్‌ను వెబ్‌సైట్‌లో చూడవచ్చు.


రాత పరీక్షలను హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో మాత్రమే నిర్వహిస్తారు. సాధారణంగా పరీక్ష హాల్లోకి కాల్‌క్యులేటర్లను అనుమతించరు. గతంలో జరిగిన GATE, ఇంజినీరింగ్‌ పరీక్షా పత్రాల నుంచి చాలావరకూ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరముంది. ఇంజినీరింగ్‌లోని ప్రాథమిక అంశాల (Basics ) నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడగవచ్చు. అందుకే వీటిపై అభ్యర్థులు దృష్టి సారించాలి.

రెండు గంటల్లో 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సివున్నందున సమయ నిర్వహణ ఎంతో ముఖ్యం. గత పరీక్షల్లో నెగిటివ్‌ మార్కులు లేవు. ఈసారి పరీక్షలో నెగిటివ్‌ మార్కులకు సంబంధించిన వివరాలు ఇంకా ప్రకటించలేదు. అందుకే పరీక్షకేంద్రంలో ప్రశ్నపత్రంపై ఉండే సూచనలను జాగ్రత్తగా చదివి పాటించాలి.

రెండు విభాగాల్లోనూ సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. కనీస అర్హత మార్కులు: ఓసీ: 40 శాతం, బీసీ : 35 శాతం, ఎస్‌సీ, ఎస్‌టీ, పీసీ: 30 శాతం. నియామకం పొందాక, శిక్షణ సమయంలో అభ్యర్థులు అర్హతకు సంబంధించిన అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లనూ కంపెనీకి సమర్పించాల్సివుంటుంది.

- వై.వి. గోపాలకృష్ణమూర్తి

Monday 19 December 2011

గ్రూప్ -1 ఇంటర్వ్యూలో విజయీభవ!


గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక మిగిలింది మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) దశ.

ప్రశ్నలు అడగటం, అభ్యర్థి చెప్పే సమాధానాల్లో కచ్చితత్వం చూడటానికి మాత్రమే ఈ ప్రక్రియ పరిమితం కాదు. అభ్యర్థి మూర్తిమత్వ లక్షణాల పరిశీలన, తద్వారా ఉద్యోగానికి అభ్యర్థి ఎంతవరకూ సరిపోతాడో ఒక నిర్థారణకూ, నిర్ణయానికీ రావటానికి ఇది ఉపయోగపడుతుంది.రాతపరీక్షల ద్వారా బయటపడని మానసిక, శారీరక లక్షణాలను గమనించటం ఇంటర్వ్యూలోనే సాధ్యమవుతుంది.

ఏ మౌఖిక పరీక్షలోనైనా సాధారణంగా ఐదు దశలుంటాయి. ప్రవేశించే దశ (Entry), పరిచయం, లోతైన చర్చ, ముగింపు, నిష్క్రమణ (Exit).

1. ప్రవేశించే దశ
అభ్యర్థి బోర్డు గదిలోకి ఎంత cosy గా ప్రవేశించాడు; పరిసరాలనూ, బోర్డు సభ్యులనూ ఎలా చూశాడు, సభ్యులను ఎలా సంబోధిస్తున్నాడు లాంటివి పరిశీలించి 'తొలి అభిప్రాయాన్ని' ఏర్పరచుకునే అవకాశం ఈ దశలో బోర్డుకు ఉంటుంది. అభ్యర్థి సాధన చేయగలిగితే ఈ దశలో మంచి అభిప్రాయం కలగజేసే వీలుంటుంది.

2. పరిచయం
'మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి' అని అభ్యర్థిని బోర్డు అడగవచ్చు. లేదా బోర్డు చైర్మన్‌ అభ్యర్థి బయోడేటాను క్లుప్తంగా మిగతా సభ్యులకు వినపడేలా చదదవచ్చు. ఆహ్లాద వాతావరణం ఏర్పడేందుకు సులభమైన, అభ్యర్థికి సంబంధించిన ప్రశ్నలనే అడుగుతారు. అభ్యర్థి కుటుంబం, విద్యా ప్రగతి, చేస్తున్న ఉద్యోగం లాంటివి ఈ పరిచయ ప్రశ్నల్లో భాగంగా చేరవచ్చు. దినపత్రికల్లో వస్తున్న వార్తలను ప్రస్తావించవచ్చు.

ఒక బోర్డులో... 'ఈ ఆఫీసుకు మీరెలా వచ్చారు?', 'బస్సులో మీ పక్క ప్రయాణికులను పరిచయం చేసుకున్నారా?' 'హైదరాబాద్‌ బస్సు ప్రయాణం ఎలా ఉంది?' లాంటి పరిచయ ప్రశ్నలు అడిగి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సమస్యపై చర్చ కొనసాగించారు.



3. లోతైన చర్చ
ఏదో ఒక అంశాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థి శక్తి సామర్థ్యాలు పరిశీలించేందుకు 'సన్నివేశ' కల్పన జరుగుతుంది. విషయ వివరణ, విభిన్నకోణాల పరిశీలన, వాద ప్రతివాదనలు, ధనాత్మక - సకారాత్మక ధోరణులు మొదలైన అంశాలను బోర్డు పరిగణనలోకి తీసుకోవచ్చు. ముఖ్యంగా భావోద్వేగాల నియంత్రణలో అభ్యర్థి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుంటారు. బోర్డు రకరకాల ఒత్తిడులను ఈ దశలో ప్రయోగించవచ్చు.

లోతైన చర్చ నుంచి బయటపడే లక్షణాలు:. ఒత్తిడికి ప్రతిస్పందన, సహనస్థాయి, స్థిత ప్రజ్ఞత, బలాలు- బలహీనతలు, వినయం, సేవాతత్పరత, నిజాయతీ, దార్శనికత (vision).

4. ముగింపు
చర్చించిన విషయాన్ని అభ్యర్థి ఏ విధంగా ముగిస్తున్నాడు, అతడి అంతిమ భావన ఏమిటి, మొదట తాను కలిగివున్న భావనల నుంచి బయటపడ్డాడా? అసంబద్ధమైన భావనలనే చర్చ ముగింపులో కూడా కలిగివున్నాడా లాంటివి పరిశీలిస్తారు. అభ్యర్థి తన హేతుబద్ధ భావనలను బోర్డు ఒత్తిడి కారణంగా వదులుకున్నాడా, 'తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు' ధోరణితో వ్యవహరించాడా ... ఇవన్నీ గమనిస్తారు.

5. నిష్క్రమణ
బోర్డు చైర్మన్‌ 'ఇక మీరు వెళ్ళవచ్చు' అని చెప్పినపుడు నిదానంగా బోర్డు సభ్యులందర్నీ ఒకసారి చూసి చైర్మన్‌కి 'కృతజ్ఞతలు' తెలియజేసి బయటకు వెళ్ళాలి. ఇలా వెళ్ళేటప్పుడు...
* బోర్డు నుంచి పారిపోయినట్టుగా వేగంగా వెళ్తున్నాడా?
* ఇంటర్వ్యూ జరిగినదాన్ని బట్టి అసంతృప్తి/సంతృప్తికి గురై అదే బాధ/ఆనందంతో వెళ్తున్నాడా?
* ప్రతిభా పాటవాల్ని ప్రదర్శించే అవకాశం మరింత ఉంటే బాగుణ్ణు అనే అభిప్రాయం అభ్యర్థిలో ఉందా?
ఇలాంటివి అంచనా వేసే అవకాశముంది. అందుకే exit behaviour ని సాధన చేయాల్సివుంటుంది.

సిద్ధం కావాల్సినవి...
1) బయోడేటా సమాచారం 2) గ్రూప్‌-1 మెయిన్స్‌ సిలబస్‌లోని పేపర్‌-2, 3, 4 అంశాలు 3) జాతీయ, అంతర్జాతీయ విషయాలు 4) రాష్ట్ర ప్రభుత్వ పథకాలు 5) సామాజిక అంశాలు 6) తాజా ఆర్థిక పరిణామాలు 7) పార్లమెంటులో ప్రవేశపెట్టిన తాజా బిల్లులు 8) గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టుల ప్రాథమికాంశాలు


- కొడాలి భవానీ శంకర్

Sunday 18 December 2011

నిమ్స్‌లో పీజీ మెడికల్ కోర్సులు

మెడిసిన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ సూపర్‌ స్పెషాలిటీ కోర్సులను అందిస్తోంది నిజామ్స్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌).

వివిధ వైద్య విభాగాల్లో ఎం.డి., ఎం.ఎస్‌. కోర్సుల్లో ప్రవేశానికి నిమ్స్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోర్సుల వ్యవధి మూడేళ్లు. నిమ్స్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (NIMSET)ద్వారా వీటిలో ప్రవేశం లభిస్తుంది.

కోర్సుల వివరాలు...
* ఎం.డి. ఎనస్థీషియాలజీ: 7 సీట్లు
* ఎం.డి. జనరల్‌ మెడిసిన్‌: 4 సీట్లు
* ఎం.డి. హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌: 3 సీట్లు
* ఎం.ఎస్‌. ఆర్థోపెడిక్స్‌: 4 సీట్లు
* ఎం.డి. పాథాలజీ: 5 సీట్లు
* ఎం.డి. రేడియోథెరపీ: 1 సీటు

అన్ని కోర్సులకు అర్హత ఎంబీబీఎస్‌. 31 మార్చి 2012 నాటికి ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసుండాలి. నిమ్‌సెట్‌లో 15 శాతం ప్రశ్నలు అసర్షన్‌, రీజనింగ్‌ పద్ధతిలో ఉంటాయి. మరికొన్ని మల్టీ రెస్పాన్స్‌ పద్ధతిలో, మిగతావి ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటాయి. నమూనా ప్రశ్నలు నిమ్స్‌ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. ప్రశ్నలు రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో అమల్లో ఉన్న ఎంబీబీఎస్‌ కోర్సు స్థాయిలో ఉంటాయి.


ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీల పరిధిలోని అభ్యర్థులకు వరుసగా 42 శాతం, 36 శాతం, 22 శాతం చొప్పున సీట్లను కేటాయిస్తారు. నిమ్స్‌ వెబ్‌సైట్‌ www.nimsexams.in  ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. తర్వాత ప్రింట్‌ కాపీలను పంపించాలి.

* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 31 డిసెంబరు 2011.
* నిమ్‌సెట్‌ తేదీ: 12 ఫిబ్రవరి 2012
* కౌన్సెలింగ్‌ తేదీ: 26 ఫిబ్రవరి 2012

Saturday 17 December 2011

సివిల్స్‌ మెయిన్స్‌ లో రేపటి మార్పులు

రీక్షా విధానంలో 'మార్పు' అనే మాట వినగానే అభ్యర్థుల్లో ఆందోళన మొదలవుతుంది.

తాజాగా 'మెయిన్స్‌లో మార్పులు రాబోతున్నాయి' అంటూ వెలువడుతున్న వార్తలు సివిల్స్‌ పరీక్షను లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థుల్లో తికమకను పెంచుతున్నాయి.

అయితే యూపీఎస్‌సీ పరీక్షల్లో ఏ మార్పులైనా ఆకస్మికంగా ప్రవేశపెట్టరని గుర్తుంచుకోవాలి. సూక్ష్మంగా పరిశీలించి, విభిన్న అభిప్రాయాలను గమనించిగానీ మార్పులకు పచ్చజెండా ఊపరు.

కాకపోతే ఏ మార్పులకు ఆస్కారముందో తెలుసుకోవటం అభ్యర్థులకు మంచిదే!

నవంబరు, డిసెంబరు అంటే... సివిల్‌ సర్వీసుల అభ్యర్థులు శ్రద్ధగా గమనించాల్సిన నెలలుగా గుర్తింపు పొందాయి. కొన్నేళ్ళక్రితమైతే ఈ సమయంలో సివిల్స్‌ నోటిఫికేషన్‌ వచ్చేది. ఇప్పుడు పరీక్షా విధానం 'మార్పుల'కు సంబంధించిన సమాచారం వెలువడుతోంది. అంతే తేడా!

డిసెంబరు మొదటివారంలో యూపీఎస్‌సీ చైర్మన్‌ సివిల్స్‌ మెయిన్స్‌లో మార్పులను సూచించటానికి ప్యానెల్‌ని నియమించామని చెప్పారు. హ్యుమానిటీస్‌ విద్యార్థులతో పోలిస్తే సైన్స్‌ సబ్జెక్టుల వారు మార్కుల పరంగా అనుచిత ప్రయోజనం పొందకుండా మార్పులను సూచించటం ప్యానెల్‌ కర్తవ్యమని వార్తాకథనాల సారాంశం. నిర్వహణ, పాలనా నైపుణ్యాలను పరీక్షించేలా పేపర్లను రూపొందించటం కూడా మరో విధి.

అలఘ్‌ కమిటీ (1991), పాలనాసంస్కరణల రెండో కమిషన్‌ (2008) సిఫార్సుల ఆధారంగానే ప్యానెల్‌ సూచనలుంటాయని భావిస్తున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఎన్నో ప్రశ్నలూ సందేహాలూ... వాటిని పరిశీలిద్దాం!


వయః పరిమితి, ప్రయత్నాల సంఖ్య మొదలైనవి ఇప్పటి కమిటీ పరిధిలో లేవని గమనించాలి.

** ప్రిలిమినరీ పరీక్షా విధానం మళ్ళీ మారుతుందా?
* లేదు. ప్రిలిమ్స్‌ యథాతథంగానే ఉంటుంది. ప్రశ్నల సంఖ్యా, వెయిటేజి మారవచ్చు. అంతేగానీ మార్కుల, పేపర్ల సంఖ్యలో ఎలాంటి మార్పులూ ఉండవు.

** మెయిన్స్‌ మార్కులకు ప్రిలిమినరీ మార్కులు కలుస్తాయా?
* అలఘ్‌ కమిటీ ఇలా సిఫార్సు చేసింది కానీ, అది ఆమోదం పొందలేదు. అందుకని ప్రిలిమ్స్‌ మార్కులు మెయిన్స్‌లో కలిపే అవకాశం లేదు.

** మెయిన్స్‌లో అవకాశమున్న సబ్జెక్టులేమిటి?
* కమిటీ పరిధిని దృష్టిలో పెట్టుకుని కింది అంచనాలకు రావొచ్చు.

1) కంపల్సరీ లాంగ్వేజ్‌ పేపర్లు- ఇంగ్లిష్‌, మోడర్న్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌ కొనసాగుతాయి. ఈ పేపర్ల స్థాయి పెరుగుతుంది. ఇప్పుడవి అర్హతా పేపర్లే. ర్యాంకును నిర్థారించే స్కోరులో వీటి మార్కులను కూడా కలిపే అవకాశముంది.

2) అలఘ్‌ కమిటీ, ఏఆర్‌సీలు ఎస్సే విషయంలో ఏకాభిప్రాయంతో లేవు. కాబట్టి వ్యాసం యథాతథంగానే ఉంటుంది.

3) ఇప్పుడున్న జనరల్‌స్టడీస్‌ పేపర్లను మార్చాలని అలఘ్‌ కమిటీ సిఫార్సు చేయగా, ఏఆర్‌సీ దాన్ని బలపరిచింది. కాబట్టి ఇప్పుడున్నట్టుగా జనరల్‌స్టడీస్‌ పేపర్లుండకపోవచ్చు. ప్రిలిమ్స్‌లో పరీక్షించిన స్టాటిస్టిక్స్‌ లాంటివాటికి మెయిన్స్‌లో చోటు దొరక్కపోవచ్చు.

** కంపల్సరీ పేపర్లు ఏవి ఉండే అవకాశముంది?
* ఇప్పటి మెయిన్స్‌లో ఆప్షనల్స్‌ అంటే- అభ్యర్థులు విశ్వవిద్యాలయ స్థాయిలో చదివిన సబ్జెక్టులపై దృష్టి పెట్టటం. కానీ విజయవంతమైన సివిల్‌ సర్వెంట్‌గా మారాలంటే... నేర్చుకోదల్చిన అంశాలపై అభ్యర్థి దృష్టిపెట్టేలా ఉండాలి. అందుకే ఆప్షనల్‌ పేపర్ల స్థానంలో అభ్యర్థి విస్తృత పరిజ్ఞానం, నైపుణ్యాలు, స్వభావం, అభిరుచులూ పరీక్షించేలా కంపల్సరీ పేపర్లను రూపొందించాలనే ప్రతిపాదన ఉంది. వివిధ సబ్జెక్టుల కలబోత స్వభావంతో ఉండే ఈ పేపర్లు హయ్యర్‌ సివిల్‌ సర్వీసెస్‌తో నేరుగా సంబంధం కలిగివుంటాయి.

ఏమిటా పేపర్లు?
1.Sustainable development and Social Justice
2. Science and Technology in Society
3. Public Systems, Democratic Governance and Human Rights
4. The constitution of India and Indian Legal System
5. Indian Economy
6. Administrative Theory and Governance in India

బహుళైచ్ఛిక (మల్టిపుల్‌ చాయిస్‌), షార్ట్‌ ఆన్సర్‌, ఎస్సే టైపు ప్రశ్నలు అడుగుతారని భావిస్తున్నారు.

** గ్రూప్‌-1 పరీక్ష తరహాలో ఉంటుందా నూతన పరీక్షా విధానం?
* అలా ఉండే అవకాశం లేదు.
** సివిల్స్‌-2012 పరీక్షా విధానం మారబోతోందనీ, అందుకే నోటిఫికేషన్‌ విడుదలలో జాప్యం జరుగుతోందనీ వదంతులు వినిపిస్తున్నాయి....

* 2012లో ఎలాంటి మార్పులూ ఉండవు. ఈ డిసెంబరు 1న రాజ్యసభలో అవినాష్‌పాండే అడిగిన ప్రశ్నకు సంబంధిత మంత్రి వి.నారాయణస్వామి జవాబిస్తూ ఈ విషయాన్నే ఇలా స్పష్టం చేశారు. 'There is no proposal to introduce changes in the Main examination of the Civil Services Examination, at present.' 

కాబట్టి అభ్యర్థులు అనవసర గందరగోళానికి గురవ్వకుండా ఇప్పుడున్న పద్ధతిలోనే పరీక్షకు సిద్ధం కావటం శ్రేయస్కరం!

- గోపాలకృష్ణ 

Thursday 15 December 2011

గ్రూప్‌-1 కొలువుకు తొలిమెట్టు

గ్రూప్‌-1 పరీక్ష ప్రిపరేషన్‌లో కీలకఘట్టం ఆన్‌లైన్‌ దరఖాస్తును సక్రమంగా పూర్తిచేసి పంపడంతోనే ప్రారంభమవుతుంది.

'దరఖాస్తు పంపించటమేముందిలే?' అనే తేలికభావం తగదు. సరిగా పూరించని చాలామంది అభ్యర్థుల దరఖాస్తులు గతంలో తిరస్కరణకు గురై హాల్‌టికెట్లు జారీ కాలేదు. ఇలాంటి చిక్కుల్లేకుండా లక్ష్యం దిశగా దూసుకువెళ్ళాలంటే ఆన్‌లైన్‌ దరఖాస్తు నింపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఎ.ఎం. రెడ్డి! 

లక్షల మంది ఉద్యోగార్థుల చిరకాల నిరీక్షణ ఫలించి గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగాల నియామకానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయింది. దీని ద్వారా 19 రాష్ట్రప్రభుత్వ శాఖలకు సంబంధించి 304 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వీటిని సాధించటం లక్ష్యంగా పెట్టుకున్నవారు వెంటనే ఆన్‌లైన్‌ దరఖాస్తును పంపుకోవాలి.

తెలుగు మీడియం అభ్యర్థులు, కంప్యూటర్‌ అవగాహన లేనివారు, ఇంటర్నెట్‌ అందుబాటులో లేనివారు ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు పొందడమెలా?
అభ్యర్థులు మొట్టమొదట ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ కోసం www.apspsc.gov.inను క్లిక్‌ చేయాలి. హోమ్‌పేజీ కనపడుతుంది. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై క్లిక్‌ చేసి తన పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, కమ్యూనిటీ (కులం) ఎంటర్‌ చేస్తే చెల్లించవలసిన ఫీజుకు సంబంధించిన చలాన్‌ వస్తుంది. దాన్ని ప్రింట్‌ తీసుకోవాలి. ఏపీ ఆన్‌లైన్‌లో కానీ, ఏదేని ఎస్‌.బి.ఐ. బ్రాంచిలో కానీ నిర్దేశించిన ఫీజు చెల్లించాలి.

ఇక్కడ ముఖ్యంగా గ్రూప్‌-1 రాయబోయే ప్రతి అభ్యర్థీ ఏ విధమైన రిజర్వేషన్‌తో ప్రమేయం లేకుండా రూ. 100 దరఖాస్తు ప్రాసెసింగ్‌ కోసం తప్పక చెల్లించాలని మరిచిపోకూడదు.

ఫీజు మినహాయింపులో చిక్కు
ఏ విధమైన ఫీజు మినహాయింపు లేనివారికి అంటే... ఉద్యోగం చేసే ఒ.సి. అభ్యర్థులందరూ అదనంగా మరో రూ. 120 చెల్లించవలసి ఉంటుంది. ఒ.సి. అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగస్తులైనా, ప్రైవేటు లేదా సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తున్నా రూ. 120 తప్పక చెల్లించాలి.

నిజానికి 34 సంవత్సరాల లోపు నిరుద్యోగ ఒ.సి.లు ఈ రూ. 120 చెల్లించవలసిన పనిలేదు. కాబట్టి చాలామంది ప్రైవేటు విద్యా సంస్థలలో లేదా ఇతర ప్రైవేటు సంస్థలలో పని చేసేవారు ఈ ఫీజు మినహాయింపు పొందాలని చూస్తారు

కానీ, ఇంటర్వ్యూ సమయంలో ఆ అభ్యర్థులను 'డిగ్రీ/పీజీ అయిన తరవాత ఏం చేస్తున్నారు' అనడిగితే వెంటనే 'ప్రైవేటు రంగంలో ఫలానా ఉద్యోగం చేస్తున్నా'నని సమాధానం ఇస్తూ ఉంటారు. అప్పుడు వారు నిజాయతీగా ఫీజు మినహాయింపు పొందలేదని బోర్డుకు తెలిసిపోతుంది. ఇంటర్వ్యూలో అలాంటి అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే రూ. 120 ఫీజు చెల్లిస్తే తమ నిజాయతీని నిరూపించుకొన్నట్లు అవుతుంది. ఇది వారికి 'ప్లస్‌ పాయింటే'!

అభ్యర్థులందరూ ఫీజు చెల్లించిన తరవాత వారికి ఫీజు చెల్లించిన చలాన్‌కు ఓ జర్నల్‌ నం. బ్యాంకు ద్వారా గానీ, ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా గానీ లభిస్తుంది. ఆ నంబరు ద్వారా ఫీజు చెల్లించిన మర్నాడు మధ్యాహ్నం రెండు గంటల తరవాత తిరిగి ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి సంబంధిత కాలమ్‌లో ఆ జర్నల్‌ నంబర్‌ను ఎంట్రీ చేసి దరఖాస్తును పొందవచ్చు.

ఇంటర్నెట్‌ కేంద్రాలు
చాలామంది గ్రామీణ అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు పంపటంలో స్థానికంగా ఉండే ఇంటర్నెట్‌ కేంద్రాలపై ఆధారపడతారు. ఆ కేంద్రాల ఆపరేటర్లు తమ ఇష్టం వచ్చినట్టు తెలిసో తెలియకో ఆప్షన్లను క్లిక్‌ చేసే అవకాశముంది. దీనివల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదముంది. కాబట్టి జాగ్రత్త వహించాల్సివుంటుంది. ప్రతి ఒక్కరూ తమ దరఖాస్తు ప్రింట్‌ కాపీని తప్పనిసరిగా తీసుకుని అందులోని సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.

చివరి తేదీ
ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాల్సిన చివరితేదీ జనవరి 8 కదా అని ఆ రోజు వరకూ తాత్సారం చేస్తే గ్రూప్‌-1 అవకాశం చేజారిపోతుంది. దరఖాస్తు పంపే చివరితేదీ జనవరి 8 కానీ ఫీజు చెల్లించాల్సిన చివరితేదీ జనవరి 6 అని మర్చిపోకూడదు.

చివరితేదీ వరకూ వేచివుండకుండా సాధ్యమైనంత త్వరగా దరఖాస్తు పంపుకోవడం మంచిది. ఎందుకంటే దరఖాస్తు పంపిననాటి నుంచే అభ్యర్థుల్లో పరీక్ష పట్ల ఆసక్తి పెరుగుతుంది. 'దరఖాస్తు పంపిన తర్వాత అంటే జనవరి 8 నుంచి ప్రారంభిద్దాంలే' అని నిర్లక్ష్యం చేస్తే ఈ పోటీపరీక్షకు సమయం సరిపోదని గుర్తించండి.

దరఖాస్తును ఆన్‌లైన్‌ ద్వారా పంపాక అది ఏ స్థాయి (status)లో ఉందో తెలుసుకోవాలంటే ఏపీపీఎస్‌సీ హోమ్‌ పేజ్‌లో పోటీపరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ నంబర్‌నూ, రెఫరెన్స్‌ ఐడీ నంబర్‌నూ, మీ పుట్టినతేదీనీ ఎంటర్‌ చేసి తెలుసుకోవచ్చు. దీనికోసం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ నంబర్‌ 18/2011- తేదీ 28-11-2011 నూ, అభ్యర్థి రెఫరెన్స్‌ ఐడీనీ భద్రపరుచుకోవాలి.

చివరిగా ఆన్‌లైన్‌ దరఖాస్తులోని చివర్లో ఉన్న imageలోని అక్షరాలను యథాతథంగా టైపు చేయాలి. లేకుంటే దరఖాస్తును స్వీకరించరు.

ఈ విధంగా దరఖాస్తును సరైనరీతిలో గడువుకు ముందుగానే పంపించడంతో గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ తొలి మెట్టు అధిరోహించినట్టే!

Monday 12 December 2011

వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ఉద్యోగాలు

ల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అన్నారు గాంధీజీ. గ్రామ స్వరాజ్యం గురించి మన రాజ్యాంగంలోని నిర్దేశిక నియమాలలో కూడా ప్రస్తావించడం జరిగింది.

అంతటి ప్రాధాన్యం గల గ్రామాల్లో దిగువ స్థాయి ప్రజాసేవకులు చాలా కీలకపాత్ర పోషిస్తారు. అందుకే ప్రభుత్వం చేపట్టిన వీఆర్‌ఓ (విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్స్‌), వీఆర్‌ఏ (విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్స్‌) నియామకాలకు అభ్యర్థుల్లో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభుత్వం చేపట్టిన ఈ నియామకాలకు బాగా పోటీ నెలకొంది.

ఈ సందర్భంగా అభ్యర్థులకు సూచనలు అందిస్తున్నారు వి.జె.రెడ్డి.

గ్రామానికి తలలో నాలుకలా ఉండే వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ఉద్యోగాల ద్వారా ప్రజలకు చేరువై సేవచేసే అవకాశం లభిస్తుంది. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో వీఆర్‌ఓ, పదో తరగతి అర్హతతో వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నియామక ప్రకటన విడుదల చేసింది. వీఆర్‌ఓ పోస్టులు 1172, వీఆర్‌ఏ పోస్టులు 6063 ఉన్నాయి. వీఆర్‌ఓ ఉద్యోగాల్లో 760 పోస్టులు జనరల్‌ కేటగిరీకి, 412 పోస్టులు మహిళలకు కేటాయించారు. వీఆర్‌ఏ పోస్టులకు లక్షన్నర మంది, వీఆర్‌ఓ పోస్టులకు సుమారు నాలుగు లక్షల మంది పోటీపడతారని అంచనా.

వీఆర్‌ఓ ఉద్యోగాలు జిల్లా స్థాయికి చెందినవి. అందువల్ల సంబంధిత జిల్లా అభ్యర్థులు మాత్రమే ఆయా జిల్లాలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. నాన్‌లోకల్‌ రిజర్వేషన్లు వర్తించవు. వీఆర్‌ఏ ఉద్యోగాలకు... ఏ గ్రామంలో ఖాళీ ఉంటే ఆ గ్రామవాసులే దరఖాస్తు చేసుకోవాలి.

ఈ రెండు పోస్టులకు రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 3 విభాగాలు ఉంటాయి...
* జనరల్‌ స్టడీస్‌: 60 మార్కులు
* అర్థమెటిక్‌ స్కిల్స్‌: 30 మార్కులు
* లాజికల్‌ స్కిల్స్‌: 10 మార్కులు


జనరల్‌ స్టడీస్‌ విభాగంలోని 60 ప్రశ్నల్లో 30 ప్రశ్నలు గ్రామాలకు సంబంధించిన అంశాలపై ఉంటాయి. వీఆర్‌ఓలుగా నియమితులైన అభ్యర్థులు పదోన్నతుల ద్వారా తహసీల్దారు దశ వరకు ఎదిగే అవకాశం ఉంటుంది. పరీక్షలోని వివిధ విభాగాలను పరిశీలిద్దాం.

జనరల్‌ స్టడీస్‌
ఇందులో కామన్‌ సబ్జెక్టులైన చరిత్ర, భూగోళశాస్త్రం, అర్థశాస్త్రం, భారత రాజ్యాంగం, జనరల్‌ సైన్స్‌ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
* చరిత్ర: భారతదేశ చరిత్రలో ఉన్న ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగ అంశాలను అధ్యయనం చేయాలి. చరిత్రలో నాగరికతలు, ప్రాచీన భారతీయ రాజవంశాలు, వారి పాలన, దండయాత్రలు, రాజుల ఆస్థానంలోని విశేషాలు, ప్రముఖ గ్రంథాలు, బిరుదులు సిలబస్‌లో ఉన్నాయి. మధ్యయుగంలో విశేషాలు, ఆధునిక చరిత్రలో బ్రిటిష్‌వారి రాక, వారి రాజ్యకాంక్ష, ఇతరులతో ప్రముఖ యుద్ధాలు, ప్రముఖ సంఘటనలు, సిపాయిల తిరుగుబాటు, భారత జాతీయ స్వాతంత్య్ర సంగ్రామం మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

అభ్యర్థులు చరిత్రకు సంబంధించిన అంశాలను ఇంటర్మీడియట్‌ స్థాయిలో చదవాలి. స్కూలు పుస్తకాలను కూడా క్షుణ్నంగా చదవాలి. సొంతగా నోట్సు రాసుకునే సమయం లేదు కాబట్టి చదివేటప్పుడు ముఖ్యమైన పాయింట్లను పుస్తకాల్లోనే అండర్‌లైన్‌ చేసుకోవడం మంచిది. దీనివల్ల రివిజన్‌ సులువవుతుంది.

* భూగోళశాస్త్రం: ఈ అంశాలను ప్రాథమిక తరగతుల నుంచే అధ్యయనం చేయాలి. ఆరు, ఏడు తరగతులలోని ప్రపంచ భౌగోళికాంశాలను బాగా చదవాలి. తొమ్మిదో తరగతిలో ఉండే ఫిజికల్‌ జాగ్రఫీ, దిగువ తరగతులలో ఉండే సముద్రశాస్త్రం, ఎనిమిదో తరగతిలోని ఆంధ్రప్రదేశ్‌ జాగ్రఫీని, పదో తరగతిలోని ఇండియన్‌ జాగ్రఫీని క్షుణ్నంగా చదవాలి. పాయింట్ల వారీగా నోట్‌ చేసుకుంటూ, మ్యాప్‌ల సాయంతో పాఠ్యాంశాలను అధ్యయనం చేయడం మంచిది.

జనరల్‌ సైన్స్‌లో ఎలా?
ప్రశ్నపత్రంలో ముఖ్యమైన భాగం జనరల్‌ సైన్స్‌. ఈ అంశాలను పాఠశాల స్థాయిలో చదివితో సరిపోతుంది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీతోపాటు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విషయాలను చదవాలి. దిగువ తరగతులలోని పాఠ్యాంశాలు పైస్థాయిలో కాఠిన్యత పెరగడంతోపాటు రిపీట్‌ అవుతుంటాయి. వీటిని గమనిస్తూ అర్థం చేసుకుంటూ చదవాలి. పటాలు ప్రాక్టీస్‌ చేయడం ద్వారా సబ్జెక్టుపై పట్టు ఏర్పడుతుంది. వివిధ పరీక్షల్లో అడిగిన జనరల్‌ సైన్స్‌ విభాగాలను అధ్యయనం చేయడం ద్వారా ప్రశ్నలను అంచనా వేయవచ్చు. ఇటీవల సైన్స్‌ రంగంలో వస్తోన్న పరిణామాలను పరిశీలించడం ద్వారా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయవచ్చు.

గ్రామీణ జీవన స్థితిగతులు
జనరల్‌ స్టడీస్‌లో సగం ప్రశ్నలు ఈ అంశం నుంచి వస్తాయి. ఇందులో గ్రామస్థాయిలో స్థానిక అంశాలను అధ్యయనం చేయాలి. పాలిటీ, ఎకానమీ, ఆంధ్రప్రదేశ్‌ జాగ్రఫీలను గ్రామీణ ప్రాంతాల నేపధ్యంతో ముడిపెట్టి చదవాలి. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్‌ నిర్మాణాలు, పాలన విధానం, విధులు, తదితర అంశాలను పరిశీలించాలి. ఈ విభాగంలో గ్రామీణ ప్రాంతాల్లోని మౌలిక వసతులు, రోడ్లు, పారిశుధ్య సమస్యలు, వ్యవసాయరంగ సమస్యలు, ప్రజల జీవన స్థితిగతులు, గ్రంథాలయాలు, విద్యావిషయక అంశాల నేపధ్యంలో ప్రశ్నలు అడగవచ్చు. జాగ్రఫీని గ్రామీణ నేపధ్యంలో... వివిధ ప్రాంతాల్లో భూమి వివరాలు, అటవీ సంపద, గ్రామీణ, ఏజన్సీ ప్రాంతాల్లో ప్రజల అవసరాలు, ఇక్కట్లు, గ్రామీణ వ్యవస్థలకు అనుబంధం చేసి చదువుకోవాలి.

ఉదాహరణకు కింది ప్రశ్నలు పరిశీలించండి...

* రాష్ట్రంలో భూగర్భ జలాలు అధికంగా ఉన్న భౌగోళిక ప్రాంతం ఏది?
* రాష్ట్రంలో ఖనిజ వనరులు అధికంగా ఉన్న జిల్లా ఏది?
* ప్రాంతీయ పాలనా మండలాల్లో అధిక ప్రాధాన్యం గల వ్యవస్థ?
* స్థానిక సంస్థలకు అధిక ఆదాయం చేకూర్చే పన్నులు ఏవి?
* వాహనదారులు టోల్‌గేట్ల వద్ద చెల్లించే పన్నులు ఎవరికి చేరుతాయి?
* సాగునీటి సంఘాలకు అధ్యక్షులుగా ఎవరు ఉంటారు?
* రాష్ట్రంలో కాయగూరలు అత్యధికంగా పండే ప్రాంతం ఏది?
* ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ముఖ్య ఆదాయ వనరు ఏది?
* ఆదివాసీ భూములకు చెందిన యాజమాన్య హక్కులపై నిర్ణయం ఎవరు తీసుకుంటారు?
* రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి?
* గ్రంథాలయాలపై విధించే ఫీజులు ఎవరికి చెందుతాయి?
* గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువగా ఏరంగంపై ఆధారపడి ఉన్నారు?
* గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఎలా ఉంది?

గ్రామీణ జీవన విధానపై ప్రశ్నలు ప్రతి రోజూ మనం చూస్తున్న, వింటున్న, మనకు అనుభవంలోకి వచ్చే విషయాలపై ఉంటాయి. కొద్దిపాటి పరిశీలనతో వీటికి జవాబులు గుర్తించవచ్చు. గ్రామీణ వ్యవస్థల పనితీరు, విధులు, స్థితిగతులు, గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం ఉండే సమస్యలను అధ్యయనం చేయడం మంచిది.

అర్థమెటిక్‌ సామర్థ్యాలు
అభ్యర్థి ప్రాథమిక గణిత సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఇందులో ప్రశ్నలు ఉంటాయి. మనకు పరిచయమైన సంఖ్యలు, సంఖ్యామానాలు, సగటులు, భిన్నాలు, సంభావ్యత, కాలం- దూరం, కాలం- పని, రేఖాగణితం, క్షేత్రమితి, తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. వీటికి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని గణిత అంశాలను చదివితే సరిపోతుంది. ఎక్కువ సమస్యలను సాధన చేయడం ద్వారా గణిత అంశాలపై పట్టు సాధించవచ్చు.

* లాజికల్‌ స్కిల్స్‌: ఈ విభాగంలో పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, రక్త సంబంధాలు, పజిల్‌ టెస్ట్‌, లాజికల్‌ వెన్‌ డయాగ్రామ్‌, శ్రేణీకరణ, మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడగవచ్చు. అభ్యర్థుల గణిత పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా, సమయానికి తగిన ప్రతిస్పందనలు టెస్ట్‌ చేసే విధంగా ప్రశ్నల కూర్పు ఉంటుంది. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా లాజికల్‌ స్కిల్స్‌పై అవగాహన పెంపొందించుకోవచ్చు.


Sunday 11 December 2011

అమెరికా విద్యాభ్యాసానికి దరఖాస్తుల తరుణం!

మ కలల కోర్సులు చదవటానికి యు.ఎస్‌.ఎ.కు ఏటా లక్షమందికి పైగా విద్యార్థులు ప్రయాణమవుతూవుంటారు.

అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందటం ఉజ్వల భవితను తీర్చిదిద్దుకోవటంలో మొదటి మెట్టు. ఆ దేశంలో అడ్మిషన్ల ప్రక్రియ చాలా సంక్లిష్టం.

ఈ సందర్భంగా విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాలను శుభకర్ ఆలపాటి వివరిస్తున్నారు!

గత ఐదేళ్ళుగా యు.ఎస్‌.ఎ.కు విద్యాభ్యాసం కోసం వెళ్ళే భారతీయ విద్యార్థుల సంఖ్య నిలకడగా పెరుగుతోంది. వీసా అనుమతి పొందేవారి కంటే ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారి సంఖ్య రెట్టింపు ఉంటుంది.

విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవటంతో తొలి అడుగు మొదలవుతుంది. యు.ఎస్‌.ఎ. విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందటం అనిశ్చితం కాబట్టి ముందుజాగ్రత్తగా చాలామంది విద్యార్థులు కనీసం 3-4 విశ్వవిద్యాలయాలకు దరఖాస్తులు పంపుకుంటారు. దీనిమూలంగా విశ్వవిద్యాలయాలకు అందే దరఖాస్తుల సంఖ్య భారీగా ఉంటుంది.

ప్రవేశం సాధించటం, వీసా... ఈ మొత్తం ప్రక్రియకు నెలల కాలం పడుతుంది. ముందుగానే విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేయటం ఎంతో మేలు. దీనివల్ల ఆఖరి నిమిషంలో పడే అనవసరపు హైరానా తప్పుతుంది; ఆందోళన తగ్గుతుంది.

రెండు సీజన్లు
యు.ఎస్‌.ఎ. విశ్వవిద్యాలయాల ప్రవేశాలకు రెండు సీజన్లుంటాయి. ఫాల్‌ (సెప్టెంబరు), స్ప్రింగ్‌ (జనవరి). కొద్ది యూనివర్సిటీలు మాత్రం సమ్మర్‌ (మే) కూడా ప్రవేశాలు అందిస్తాయి. వీటిలో అన్ని యూనివర్సిటీలూ, కోర్సులూ ప్రారంభయ్యేదీ, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరేదీ ఫాల్‌లోనే. తమ విద్యాసంవత్సరం ముగిశాక వచ్చే ఈ సమయంలో చేరటానికే విద్యార్థులు మొగ్గుచూపుతుంటారు. బ్యాచిలర్స్‌ డిగ్రీ తర్వాత కాలం వృథా కాకుండా వెంటనే మాస్టర్స్‌లో కొనసాగటానికి వీలవుతుందన్నమాట!

దరఖాస్తు గడువులు
ఈ తేదీలు ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో రకంగా ఉంటాయి. విశ్వవిద్యాలయ విధానాలూ, నిబంధనల ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు.

సాధారణంగా ఉత్తమ ర్యాంకింగ్‌ ఉన్న విశ్వవిద్యాలయాలకు విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేయాల్సిన గడువులు కింది విధంగా ఉంటాయి.
ఫాల్‌: డిసెంబరు 31 స్ప్రింగ్‌: ఆగస్టు1
కొన్ని ఇతర విశ్వవిద్యాలయాలకు:
ఫాల్‌: మార్చి 1 స్ప్రింగ్‌: అక్టోబరు 1
అంత మంచి ర్యాంకులు లేని విశ్వవిద్యాలయాలకు:
ఫాల్‌: మే 1 స్ప్రింగ్‌: నవంబరు 1

ఒకే విశ్వవిద్యాలయంలో ఒక్కో విభాగానికి ఒక్కో రకమైన గడువుతేదీలు కూడా ఉంటాయి. ఫార్మసీ, హెల్త్‌ సైన్సెస్‌, సైన్సెస్‌ లాంటి కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమవటానికి చాలా తక్కువ వ్యవధే ఉంటుంది. అందుకని ముందుగానే దరఖాస్తు చేయాల్సివుంటుంది.

ఆర్థిక మాంద్యం మూలంగా ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల అలభ్యత వల్ల చాలా విశ్వవిద్యాలయాలకు ఫండింగ్‌ అవకాశాలు తక్కువే. ఒకప్పటితో పోలిస్తే ఉపకార వేతనాలు చాలా తక్కువ. వీటి అవసరమున్నవారు తుది గడువు కంటే చాలాముందే దరఖాస్తు చేసుకోవటం శ్రేయస్కరం.

  ఉపకారవేతనాలతో పాటు ప్రవేశం కావాలంటే చాలా విశ్వవిద్యాలయాలకు వేర్వేరు గడువు తేదీలుంటాయి. వీటి వివరాలను వెబ్‌సైట్లలో కూడా పేర్కొనరు. అందుకే ఉపకార వేతనాలూ, ఫీజు రాయితీలూ కావాలనుకున్నవారు జాప్యం లేకుండా దరఖాస్తు చేయటం చాలా ముఖ్యం. మొదట వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి.
యు.ఎస్‌. విద్యార్థి వీసా (ఎఫ్‌ 1) ప్రక్రియ చాలా వ్యవధి తీసుకుంటుంది. ప్రవేశాల దగ్గర్నుంచి వీసా వరకూ 3-6 నెలల సమయం, ఒకోసారి అంతకంటే అధిక సమయం కూడా పడుతుంది. అయితే కొన్నిసార్లు చాలా వేగంగా ఈ ప్రక్రియ పూర్తవటం కూడా జరగొచ్చు.

అన్నీ పరిశీలించాకే...
దరఖాస్తును వివిధ విభాగాలవారీగా సాకల్యంగా సమీక్షించాకే I 20 ను నిర్థారిస్తారు. ఈ నిర్ణయ సమాచారం ఏర్‌మెయిల్‌ ద్వారానే పంపుతారు కాబట్టి సీటు పొందిన విషయం వెంటనే కాకుండా... దాదాపు 20 రోజుల్లో విద్యార్థికి తెలిసే అవకాశముంది.

ఫాల్‌ ఇన్‌టేక్‌లో విద్యార్థికి ప్రవేశంతో పాటు ఇతర అవకాశాలుంటాయి... ఫండింగ్‌, అసిస్టెంట్‌షిప్స్‌, ఉపకారవేతనాలు, ఆన్‌క్యాంపస్‌ వసతి మొదలైనవి. అన్ని దేశాల నుంచీ దరఖాస్తులు వస్తుంటాయి కాబట్టి 'ఇంటర్నేషనల్‌ అడ్మిషన్స్‌ డిపార్ట్‌మెంట్‌' అర్హతలున్న విద్యార్థులందరికీ ప్రవేశాలూ, ఉపకారవేతనాలను ఖరారు చేయలేదు. కారణం- సీట్లు, ఫండింగ్‌, అసిస్టెంట్‌షిప్‌ అవకాశాలు పరిమితం కాబట్టి.

ఏ విద్యార్థి అయినా నవంబరులో, డిసెంబరు ప్రథమ భాగంలో దరఖాస్తు పంపుకుంటే ప్రవేశాలు పొందటానికి ఎక్కువ అవకాశాలుంటాయి. అదే విద్యార్థి కాలయాపన చేసి, అదే విశ్వవిద్యాలయానికి ఏ ఫిబ్రవరిలోనో దరఖాస్తు చేస్తే ప్రవేశం లభించకపోవచ్చు.

యూనివర్సిటీ నుంచి ఫండింగ్‌/అసిస్టెంట్‌షిప్‌ పొందిన విద్యార్థులకు యు.ఎస్‌. ఎంబసీలో ఎక్కువ అనుకూలత ఉండి వీసా లభించే అవకాశం పెరుగుతుంది.

Saturday 10 December 2011

ఐటీ అవకాశాలకు... సీడాక్‌ డిప్లొమాలు



టీ, సాఫ్ట్‌వేర్‌ రంగాలకు అవసరమైన స్వల్ప వ్యవధి కోర్సులను అందించడంలో మంచి పేరున్న సంస్థ... సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడాక్‌). 

 ఇంజినీరింగ్‌, ఎం.ఎస్‌సి. అభ్యర్థులకు ఈ సంస్థ అనేక రకాల జాబ్‌ ఓరియంటెండ్‌ కోర్సులను నిర్వహిస్తోంది. ప్రతిభావంతులైన అభ్యర్థులకు ప్లేస్‌మెంట్‌ విషయంలో సహకరిస్తుంది.

ఆధునిక ప్రయోగశాలలు, పరిశ్రమల అవసరాలకు తగినట్లు కోర్సుల రూపకల్పన, శిక్షణలో సీడాక్‌కు చాలా నైపుణ్యం ఉంది. హార్డ్‌వేర్‌ టెక్నాలజీస్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌, వెబ్‌ టెక్నాలజీస్‌, తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణను అందిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో సీడాక్‌ కేంద్రాలున్నాయి. హైదరాబాద్‌లోని సీడాక్‌ కింది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

* డిప్లొమా ఇన్‌ ఎంబెడెడ్‌ సిస్టమ్‌ డిజైన్‌: సీడాక్‌ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, నోయిడా, పుణె, తిరువనంతపురం, ఔరంగాబాద్‌ కేంద్రాల్లో ఈ కోర్సు ఉంది. ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా పీజీ, ఎం.ఎస్‌సి. ఎలక్ట్రానిక్స్‌ లేదా ఐటీ కోర్సులు చేసిన అభ్యర్థులు అర్హులు.

* డిప్లొమా ఇన్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌: హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, పుణె కేంద్రాల్లో చేయవచ్చు. ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా పీజీ, ఎం.ఎస్‌సి. కంప్యూటర్స్‌, ఎంసీఏ అభ్యర్థులు అర్హులు.

* డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ బిజినెస్‌ కంప్యూటింగ్‌: హైదరాబాద్‌ కేంద్రంలో మాత్రమే ఈ కోర్సు ఉంది. ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా పీజీ, ఎం.ఎస్సీ. కంప్యూటర్స్‌, ఎంసీఏ చదివినవారు ఈ కోర్సు చేయవచ్చు.

ప్రవేశం ఎలా?
ఈ కోర్సుల వ్యవధి 22 వారాలు. కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సీడాక్‌ కోర్సులకు పరిశ్రమల్లో బాగా విలువ ఉంటుంది. సీడాక్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు నిర్వహిస్తోంది. శామ్‌సంగ్‌, సీమెన్స్‌, ఐగేట్‌, మహీంద్రా సత్యం, టెరాడేటా, హెచ్‌ఎస్‌బీసీ, హానీవెల్‌ టెక్నాలజీస్‌, సీడాక్‌, తదితర సంస్థలు సీడాక్‌ కోర్సులు చేసినవారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి.

మూడు కోర్సులకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీఈటీ)లో టెక్నికల్‌, ఆప్టిట్యూడ్‌ అంశాలకు సంబంధించిన ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. సెట్‌ స్కోరు, శిక్షణ కేంద్రం, అకడమిక్‌ రికార్డు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. దరఖాస్తు సమయంలో శిక్షణ కేంద్రం, కోర్సు ప్రాధమ్యాలను ఎంచుకోవాలి. 


కోర్సులు 12 మార్చి 2012న ప్రారంభమై 11 ఆగస్టు 2012న ముగుస్తాయి.

సెట్‌కు ఉపయోగపడే పుస్తకాలు
* Digital Logic and Computer Design by Morris Mano
* Microprocessors and Interfacing by Douglas V Hall
* Data & Computer Communication by William Stallings
* The C Programming Language by B W Kernighan & Dennis Ritchie
* Data Structures by Lipschutz and Seymour
* Operating System Concepts by Silbeschatz and Galvin

* సీడాక్‌ హైదరాబాద్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10 జనవరి 2012
* సెట్‌ తేదీ: 29 జనవరి 2012
* సెట్‌ ఫలితాల విడుదల: 14 ఫిబ్రవరి 2012

సెంట్రల్‌ యూనివర్సిటీలో దూరవిద్య కోర్సులు

    దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ దూరవిద్య పద్ధతిలో వివిధ పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తోంది.

యూనివర్సిటీ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ వర్చ్యువల్‌ లెర్నింగ్‌ ఈ కోర్సులను నిర్వహిస్తోంది.

ఎన్‌ఐఆర్‌డీ, జీవీకే బయోసైన్సెస్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, ట్రూత్‌ ల్యాబ్స్‌, నార్మ్‌ సహకారంతో ప్రత్యేక కోర్సులను అందిస్తోంది.

పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌ల వివరాలు...
    * ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌
    * కెమికల్‌ ఎనాలిసిస్‌ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌
    * సైబర్‌ లాస్‌ అండ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌
    * బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌
    * క్రిమినల్‌ జస్టిస్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌
    * గవర్నన్స్‌
    * హ్యూమన్‌ రైట్స్‌
    * టెలికమ్యూనికేషన్స్‌
    * కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌
    * ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌ ఇన్‌ హిందీ
    * మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ టెక్నిక్స్‌ ఇన్‌ తెలుగు
    * మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ టెక్నిక్స్‌ ఇన్‌ ఉర్దూ
    * మెడిసినల్‌ బోటనీ
    * సస్టయినబుల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌
    * టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ అగ్రికల్చర్‌
    * బయో ఇన్ఫర్మేటిక్స్‌

వీటిలో చాలావరకు కోర్సులకు ప్రధాన అర్హత ఏదైనా డిగ్రీ. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని కోర్సులకు ప్రత్యేక అర్హతలు అవసరం. కోర్సుల వ్యవధి ఏడాది. విద్యార్థులతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తోన్న అభ్యర్థులు సంబంధిత రంగంలో తమ అవగాహన, సామర్థ్యాలు పెంపొందించుకోవడానికి ఈ ప్రోగ్రామ్‌లు ఉపయోగపడతాయి. అర్హత పరీక్షలో ప్రతిభ, అకడమిక్‌ రికార్డు, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది.
    * కెమికల్‌ ఎనాలిసిస్‌ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు డిగ్రీలో కెమిస్ట్రీ చదివుండాలి.
    * టెలికమ్యూనికేషన్స్‌ కోర్సుకు డిగ్రీలో మేథ్స్‌ లేదా ఫిజిక్స్‌ లేదా ఎలక్ట్రానిక్స్‌ చదివినవారు అర్హులు.
    * ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌ కోర్సులకు అభ్యర్థులు డిగ్రీలో సంబంధిత లాంగ్వేజ్‌ను (హిందీ, ఉర్దూ, తెలుగు) ఒక సబ్జెక్టుగా చదివుండాలి.
    * టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ కోర్సుకు కనీసం రెండేళ్ల అనుభవం అవసరం.
    * బయో ఇన్ఫర్మేటిక్స్‌ కోర్సుకు డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు అసవరం.

ఏడాదిలో ఒకటి లేదా రెండుసార్లు కాంటాక్టు తరగతులు నిర్వహిస్తారు. ఫీజులు కోర్సును బట్టి వేర్వేరుగా ఉంటాయి.

ఈ వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. దరఖాస్తులను కూడా వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 31 జనవరి 2012.

Friday 9 December 2011

టాటా మోటార్స్‌ స్కాలర్‌షిప్‌లు

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థ డబ్ల్యు.ఎల్‌.సి. సంయుక్తంగా పని ఆధారిత (వర్క్‌ బేస్డ్‌) స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి.

ఈ రెండు సంస్థలు కలిసి ఏర్పాటుచేసిన డబ్ల్యు.ఎల్‌.సి.ఐ. అండ్‌ టాటా మోటార్స్‌ అకాడమీ ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.

'సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఆటోమొబైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్‌' కోర్సులో భాగంగా వీటిని ఇస్తారు.

ఇంజినీరింగ్‌, డిప్లొమా కోర్సులు చేసిన విద్యార్థులకు ఈ కోర్సు, స్కాలర్‌షిప్‌ మంచి అవకాశం కల్పిస్తుంది. ఇతర గ్రాడ్యుయేట్లు కూడా అర్హులు. కోర్సు వ్యవధి 11 నెలలు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు టాటా మోటార్స్‌ అధీకృత డీలర్‌షిప్‌లలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.

ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌, కోల్‌కతా, నోయిడాలో శిక్షణ కేంద్రాలున్నాయి. శిక్షణ కాలంలో రూ.8000 - 10000 వరకు స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. శిక్షణ తర్వాత ఉద్యోగంలో ప్రారంభ వేతనం ఏడాదికి రూ.2 లక్షలకుపైగా ఉంటుంది.

డబ్ల్యు.ఎల్‌.సి.ఐ., టాటా మోటార్స్‌ ఆధ్వర్యంలో నాలుగు నెలలు శిక్షణ ఉంటుంది. తర్వాత 7 నెలలు టాటా మోటార్స్‌ కంపెనీ కేంద్రాల్లో ఆచరణాత్మక శిక్షణ ఇస్తారు. అభ్యర్థి తనకు దగ్గర్లోని టాటా మోటార్స్‌ కేంద్రంలో ఈ శిక్షణ తీసుకోవచ్చు.

www.careers-tatamotorsdealers.com వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

చివరితేదీ 15 డిసెంబరు 2011.

Wednesday 7 December 2011

వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు ప్రకటన వెలువడింది!

ద్యోగార్థులు చాలా కాలంగా  ఎదురుచూస్తున్న VRO, VRA పోస్టుల నియామక ప్రకటన ఇవాళ  ఈనాడులో  వెలువడింది.  డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకాలు జరుగుతాయి.

నోటిఫికేషన్లను  జిల్లాల వారీగా విడివిడిగా ప్రకటించారు. ఇవాళ్టి  ఈనాడు జిల్లాల  ఎడిషన్లలో సంబంధిత జిల్లాల వారు ఈ ప్రకటన(ల)ను   చూడవచ్చు.

హైదరాబాద్ మినీ పేపర్లో  ప్రకటించిన నోటిషికేషన్ ఇది.  (కొన్నిజిల్లాల్లో VRO, VRA నోటిఫికేషన్ల అడ్వర్ టైజ్ మెంట్లను  వేర్వేరు పేజీల్లో ప్రచురించారు).

Tuesday 6 December 2011

బయో ఇన్ఫర్మేటిక్స్‌ ఉద్యోగాలకు బి.ఐ.ఎన్‌.సి.


నదేశంలో బయో ఇన్ఫర్మేటిక్స్‌ పరిశ్రమలు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నాయి. శాస్త్ర పరిశోధనలను వేగవంతం చేయడంలో కీలకంగా మారిన బయో ఇన్ఫర్మేటిక్స్‌ రంగం ఐరోపా దేశాలు, అమెరికాలో బాగా విస్తరించింది. 

బయాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో సామర్థ్యాలు ఉన్నవారికి ఈ రంగంలో మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. 

ఈ ఉద్యోగాలు సాధించడానికి అవసరమైన సామర్థ్యాలను అందించడం లక్ష్యంగా డీబీటీ 'బయో ఇన్ఫర్మేటిక్స్‌ నేషనల్‌ సర్టిఫికేషన్‌' ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. 

బీఐఎన్‌సీ 2012 నోటిఫికేషన్‌ ఇటీవల వెలువడింది. పుణె, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, షిలాంగ్‌, హైదరాబాద్‌, తిరువనంతపురం, గౌహతిలో పరీక్ష కేంద్రాలున్నాయి.

బయోఇన్ఫర్మేటిక్స్‌ రంగానికి సంబంధించి అభ్యర్థి తెలివితేటలు, సామర్థ్యాలను అంచనా వేయడం బీఐఎన్‌సీ పరీక్ష ఉద్దేశం. 

ఈ ఏడాది నుంచి బీఐఎన్‌సీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందరికీ డీబీటీ జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌లు ఇవ్వనుంది. గతంలో టాప్‌ 10 అభ్యర్థులకు మాత్రమే ఫెలోషిప్‌లు ఉండేవి. బీఐఎన్‌సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు పీహెచ్‌డీ చేయాలనుకుంటే సంబంధిత విద్యాసంస్థ ప్రవేశ నిబంధనలకు అనుగుణంగా ఫెలోషిప్‌ లభిస్తుంది. 

ఇదిగాక బీఐఎన్‌సీలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన 10 మంది అభ్యర్థులకు ప్రత్యేకంగా రూ.10000 చొప్పున నగదు బహుమతి కూడా ఇస్తారు.

నియామకాల్లో ప్రాధాన్యం
బయో ఇన్ఫర్మేటిక్స్‌ రంగంలో కొత్తగా ప్రవేశించాలనుకునే అభ్యర్థులతోపాటు, ఇప్పటికే పరిశ్రమల్లో పనిచేస్తోన్న ప్రొఫెషనల్స్‌కు కూడా బీఐఎన్‌సీ శిక్షణ వల్ల ప్రయోజనం ఉంటుంది. బీఐఎన్‌సీలో చేరాలంటే బయో ఇన్ఫర్మేటిక్స్‌లో డిగ్రీ లేదా మాస్టర్స్‌ డిగ్రీ లేదా డిప్లొమా చేయాల్సిన అవసరం లేదు. ఈ రంగం పట్ల ఆసక్తి ఉంటే సరిపోతుంది. నియామకాల సమయంలో బయో ఇన్ఫర్మేటిక్స్‌ కంపెనీలు ఈ సర్టిఫికేషన్‌ ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుంది. 

దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య వేయిమంది లోపే ఉంటుంది. ఇప్పటివరకు ఈ పరీక్షను యూనివర్సిటీ ఆఫ్‌ పుణె నిర్వహించింది. బీఐఎన్‌సీ-2012 పరీక్ష బాధ్యతలను న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) చేపట్టింది. జేఎన్‌యూకు యూనివర్సిటీ ఆఫ్‌ పుణె, అన్నా యూనివర్సిటీ (చెన్నై), వెస్ట్‌ బెంగాల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ (కోల్‌కత), ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ బయో ఇన్ఫర్మేటిక్స్‌ అండ్‌ అప్లయిడ్‌ బయోటెక్నాలజీ (బెంగళూరు), నార్త్‌ ఈస్ట్రన్‌ హిల్‌ యూనివర్సిటీ (షిల్లాంగ్‌), యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (హైదరాబాద్‌) సహకరిస్తున్నాయి.

పరీక్ష విధానం
బీఐఎన్‌సీ 2012 పరీక్షలో మొత్తం మూడు పేపర్లుంటాయి. అన్నిటిలోనూ సబ్జెక్టుకు సంబంధించిన ప్రాథమిక అంశాల్లో అభ్యర్థి అవగాహన, సామర్థ్యాలను పరీక్షిస్తారు. 

పేపర్ల వివరాలు...
 * పేపర్‌-1: ఇది ఆబ్జెక్టివ్‌ టైప్‌ పరీక్ష. 25 ఫిబ్రవరి 2012న జరగనుంది. ఇందులో మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. దీనిలో బయో ఇన్ఫర్మేటిక్స్‌కు 40 శాతం, బయాలజీకి 20 శాతం, ఫిజికల్‌ అండ్‌ కెమికల్‌ సైన్సెస్‌కు కలిపి 20 శాతం, ఐటీకి 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

* పేపర్‌ 2: ఇది స్వల్ప సమాధాన ప్రశ్నలతో కూడిన పేపర్‌. ఫిబ్రవరి 26, 2012న దీన్ని నిర్వహిస్తారు. ఇందులో 20 ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు 200. ఈ ప్రశ్నపత్రానికి కేటాయించిన సమయం 3 గంటలు. ఇందులో బయోఇన్ఫర్మేటిక్స్‌కు 40 శాతం, ఐటీకి 20, బయాలజీకి 20 శాతం, ఫిజికల్‌ అండ్‌ కెమికల్‌ సైన్సెస్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. గత ఏడాది నుంచి ఈ పరీక్ష స్వభావం మారింది.

* పేపర్‌ 3: ఇది ప్రాక్టికల్స్‌ పరీక్ష. దీన్ని 26 ఫిబ్రవరి 2012న రెండు బ్యాచ్‌లుగా నిర్వహిస్తారు. దీనికి కేటాయించిన మార్కులు 100. ప్రాక్టికల్‌ పూర్తిచేయాల్సిన సమయం 2 గంటలు.

పేపర్‌-1లో తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కును తీసేస్తారు. పేపర్‌-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను పరీక్ష జరిగిన రోజే (25 ఫిబ్రవరి 2012) సంబంధిత కేంద్రంలో ప్రకటిస్తారు. ఇందులో కనీసం 40 శాతం మార్కులు ఉంటే పేపర్‌-2, పేపర్‌-3కి అనుమతిస్తారు. అన్ని పేపర్లలో కనీసం 40 శాతం మార్కులు సాధించినవారికి సర్టిఫికేషన్‌ లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జేఎన్‌యూ - బీఐఎన్‌సీ వెబ్‌సైట్‌లో పెడతారు.

పరీక్ష సిలబస్‌
బీఐఎన్‌సీ సిలబస్‌లో మొత్తం ఐదు విభాగాలుంటాయి. అవి... బయాలజీ, ఫిజికల్‌ అండ్‌ కెమికల్‌ సైన్సెస్‌, మేథమేటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్‌. పేపర్‌-1లో అన్ని విభాగాలకు సంబంధించిన అంశాలపై ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలుంటాయి. ఆయా సబ్జెక్టుల్లోని ప్రాథమిక అంశాలపై ప్రశ్నలడుగుతారు.

* పేపర్‌-2లో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-3 కంప్యూటర్‌ ఆధారిత ప్రాక్టికల్‌ పరీక్ష. ఇందులో బయో ఇన్ఫర్మేటిక్స్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రశ్నలుంటాయి. పేపర్ల వారీగా పూర్తి సిలబస్‌, మాదిరి ప్రశ్నపత్రాలు జేఎన్‌యూ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

దరఖాస్తు విధానం
సైన్స్‌, అగ్రికల్చర్‌, వెటర్నరీ, మెడిసిన్‌, ఫార్మసీ, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, అంతకంటే పైస్థాయి కోర్సులు చేసిన అభ్యర్థులు బీఐఎన్‌సీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులు. ఫెలోషిప్‌ మాత్రం పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసి, పీహెచ్‌డీకి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులకే లభిస్తుంది. బయో ఇన్ఫర్మేటిక్స్‌లో ఎలాంటి సర్టిఫికెట్‌, డిప్లొమా, డిగ్రీ చదివుండాల్సిన అవసరం లేదు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

బీఐఎన్‌సీ 2012 పరీక్షకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులకు ఈ-మెయిల్‌, 'ఫైనాన్స్‌ ఆఫీసర్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ' పేరు మీద న్యూఢిల్లీలో చెల్లే విధంగా తీసిన రూ.600లకు (రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు రూ.450) డిమాండ్‌ డ్రాఫ్ట్‌ అవసరం. డీడీ వెనుక పేరు, దరఖాస్తు సంఖ్య రాయాలి. 

ఆన్‌లైన్‌లో ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు పూర్తిచేసిన వెంటనే దాన్ని ప్రింట్‌ అవుట్‌ తీసుకోవాలి. దీనికి డిమాండ్‌ డ్రాఫ్ట్‌ జతచేసి, రెండు ఫొటోగ్రాఫ్‌లతో 'కో ఆర్డినేటర్‌, బీఐఎన్‌సీ ఎగ్జామినేషన్‌, స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటేషనల్‌ అండ్‌ ఇంటెగ్రేటివ్‌ సైన్సెస్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ- 110067'కి పంపించాలి.

* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరితేదీ: 3 ఫిబ్రవరి, 2012
* ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రింట్‌లు చేరడానికి చివరితేదీ: 7 ఫిబ్రవరి 2012.
* పరీక్ష రాయడానికి అర్హులైన అభ్యర్థులు జాబితా విడుదల తేదీ: 10 ఫిబ్రవరి 2012.
* వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు లభించే తేదీ: ఫిబ్రవరి 10, 2012
* బీఐఎన్‌సీ పరీక్ష తేదీలు: 25-26 ఫిబ్రవరి 2012.