ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 23 January 2012

పక్కాగా సిద్ధమైతే ప్రభుత్వ కొలువులు!



క్షలమంది పోటీ పడే గ్రూప్‌-4 పోస్టుల నియామకానికి ఏపీపీఎస్‌సీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తులకైనా, పరీక్షకైనా సమయం ఉంది. అలా అని ప్రిపరేషన్‌ ప్రారంభించటంలో తాత్సారం చేయకూడదు.

'సర్కారీ కొలువు సాధించాల్సిందే' అనే దృఢ సంకల్పం ఉంటే వెంటనే ముందడుగు వేయండి.

మీ లక్ష్యసాధనకు ఉపకరించే విలువైన సూచనలు అందిస్తున్నవారు కొడాలి భవానీ శంకర్.

మొత్తం 2146 పోస్టులకు గ్రూప్‌-4 ప్రకటన వెలువడింది. దరఖాస్తుల ప్రక్రియ మే నెల చివర్లో, రాతపరీక్ష ఆగస్టు 11న! సమగ్ర ప్రిపరేషన్‌కు నాందీ ప్రస్తావన చేయాల్సిన సమయమిదే. అప్పుడే విజయానికి అవకాశాలు పెరుగుతాయి.

ప్రస్తుత గ్రూప్‌-4 పోస్టుల్లో 'హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌' పోస్టుకు మాత్రం డిగ్రీ + బీఎడ్‌ కనీస అర్హతగా ఉంది. మిగతా జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ అర్హత. పదో తరగతి అర్హత కలిగిన పోస్టులేమీ లేకపోవడం గమనార్హం.

ఖజానా శాఖలో మాత్రం ఇంటర్మీడియట్‌ అర్హతే కాకుండా సర్టిఫికెట్‌ కోర్సు- ఆఫీస్‌ ఆటోమేషన్‌- పీసీ మెయింటెనెన్స్‌- వెబ్‌ డిజైనింగ్‌ కూడా అడిగారు. ఇక్కడ గమనించాల్సిన సూచన ఏమిటంటే... బీసీఏ, బీఎస్‌సీ (కంప్యూటర్స్‌), బీకాం (కంప్యూటర్స్‌), బీటెక్‌/బీఈ (కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ) అర్హతలు కలిగినవారికి పైన చెప్పిన సాంకేతిక అర్హతలకు మినహాయింపు ఉంటుంది. మిగతా శాఖల్లోని గ్రూప్‌-4 ఉద్యోగాలకు అర్హత ఇంటర్మీడియట్‌.

తమ అర్హతలు ప్రామాణికంగా అభ్యర్థులు పోస్టులను ఎంపిక చేసుకుని కృషి చేయటం మంచిది.
1) జూనియర్‌ అసిస్టెంట్స్‌: పేపర్‌-1 జనరల్‌స్టడీస్‌, 150 మార్కులు/ప్రశ్నలు పేపర్‌-2 సెక్రటేరియల్‌ ఎబిలిటీ, 150 మార్కులు/ప్రశ్నలు
2) హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌: పేపర్‌-1 జనరల్‌స్టడీస్‌, 150 మార్కులు/ప్రశ్నలు పేపర్‌-2 బి.ఇడి అంశాలు, 150 మార్కులు/ ప్రశ్నలు



జూనియర్‌ అసిస్టెంట్స్‌
పేపర్‌-1: జనరల్‌స్టడీస్‌
అర్హత పరీక్ష ఇంటర్మీడియట్‌ అయినప్పటికీ గత గ్రూప్‌-4 పరీక్షలో జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, చరిత్ర లాంటి అంశాల నుంచి వచ్చిన ప్రశ్నల స్థాయి గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఉంది. ఈ కారణం వల్లనే పదో తరగతి స్థాయి వరకూ మాత్రమే చదివిన అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. అందుకని ప్రస్తుతం పోటీ పడేందుకు పాఠశాల స్థాయి పుస్తకాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఇతర గ్రూప్‌ పరీక్షలకు తయారయ్యే స్థాయిలో జనరల్‌స్టడీస్‌ను చదవటం మంచిది. ఈ అంశాలతో పాటు కింది అంశాలు కూడా ముఖ్యమే.

* Factఆధారిత ప్రశ్నలు గతంలో ఎక్కువగా వచ్చాయి. రేపటి పరీక్షలో కూడా ఇవి వచ్చే అవకాశం ఉంది. అందుకే నామమాత్రంగా విశ్లేషణకు ప్రాధాన్యం ఇస్తూ జ్ఞాపకశక్తిపై ఆధారపడే సమాచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి.
* పాఠ్యాంశ ఆధారిత ప్రశ్నలకు ఎక్కువ అవకాశం.
*  ఇటీవల మారిన పాఠ్యపుస్తకాలను దృష్టిలో పెట్టుకోవాలి.

* బిట్లవారీగా చదవకూడదు. విషయాన్ని అర్థం చేసుకుంటూ చదవటమే సరైన విధానం. గ్రామీణ అభ్యర్థులు ప్రశ్నల నిధులపై అధికంగా ఆధారపడుతున్నారు. ఇది సరైన విధానం కాదు.
* గత గ్రూప్‌-4 పరీక్షలో వర్తమాన అంశాలను కొంచెం లోతుగా అడిగారు. అందుకే ఇప్పటినుంచీ సిద్ధమైతేనే మంచి ఫలితాలుంటాయి.
* మార్కెట్లో దొరికే చాలా పుస్తకాల్లో వృథా సమాచారం ఎక్కువ. ప్రభుత్వ ప్రచురణలకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం మేలు. పాఠ్యపుస్తకాలూ, తెలుగు అకాడమీ పుస్తకాలపై బాగా ఆధారపడినవారికే గ్రూప్‌-2 పరీక్షల్లో మంచి ఫలితాలు సాధ్యం.


 


పేపర్‌-2: సెక్రటేరియల్‌ ఎబిలిటీ
సిలబస్‌ అంశాలు- మెంటల్‌ ఎబిలిటీ, సంఖ్యా/అంక గణిత సామర్థ్యం, లాజికల్‌ రీజనింగ్‌, కాంప్రహెన్షన్‌, వాక్యాల పునరమరిక. ఈ పేపర్లలో సాధించే మార్కులే అంతిమ విజయ సాధనలో కీలకం. ముఖ్యంగా పేపర్‌-1లో సీనియారిటీ, బట్టీ, అనుభవం లాంటి అంశాలు కొంతమందికి తోడ్పడి మంచి మార్కులు సాధించేందుకు దోహదం చేయవచ్చు. కానీ పేపర్‌-2లో స్వతహాగా సత్తా లేకుంటే కొంత వెనుకబాటుతనం ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఈ పేపర్‌పై అధిక దృష్టి పెట్టటం ద్వారా మెరుగైన మార్కులను సాధించవచ్చు.

* సాధన ముఖ్యం.
* అంకగణిత సమస్యల విషయంలో షార్ట్‌కట్స్‌ వల్ల సమయం సద్వినియోగమవటమే కాకుండా కచ్చితత్వం పెరుగుతుంది.
* లాజికల్‌ రీజనింగ్‌లో ఇండక్షన్‌, డిడక్షన్‌, అబ్‌డక్షన్‌ ప్రక్రియలను సమర్థంగా వినియోగిస్తే కచ్చితమైన సమాధానాలు గుర్తించవచ్చు.
* కాంప్రహెన్షన్‌, వాక్యాల పునరమరికలపై సమయం కొద్దిగా వెచ్చిస్తే చాలు.
* బ్యాంకు పీఓ స్థాయిలో లోతైన ప్రశ్నలు ఉండవు కాబట్టి సాధారణ స్థాయిలోనే చదివితే సరిపోతుంది.
ఇంటర్మీడియట్‌ సిలబస్‌తో వీఆర్‌ఓకి సిద్ధమవుతున్నవారు, గ్రూప్‌-4లో 1335 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని గుర్తించాలి. సిలబస్‌ తేడాలు గుర్తించి మరో 6 నెలలు కష్టపడితే ఫలితం రావొచ్చు.




No comments:

Post a Comment