ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday 13 September 2011

డిగ్రీ, పీజీ విద్యార్థులకు సెంట్రల్‌ స్కాలర్‌షిప్‌లు

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రాడ్యుయేషన్‌, పీజీ కోర్సులు చేస్తున్న అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌లను ప్రవేశ పెట్టింది.

'సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ ఆఫ్‌ స్కాలర్‌షిప్స్‌ ఫర్‌ కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌' పేరుతో వీటిని అమలుచేస్తోంది.

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యాబోర్డులకు వీటిని కేటాయిస్తుంది. 18-25 ఏళ్ల మధ్య గల జనాభాను దృష్టిలో ఉంచుకొని ఆయా బోర్డులకు స్కాలర్‌షిప్‌ల సంఖ్యను నిర్ణయిస్తుంది.

మొత్తం మీద ఈ పథకం ద్వారా జాతీయ స్థాయిలో 82 వేల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించనుంది.

మొత్తం స్కాలర్‌షిప్‌లలో సగం అమ్మాయిలకు కేటాయిస్తారు. సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌ సబ్జెక్టులకు 3:2:1 నిష్పత్తిలో విభజిస్తారు.

కనీసం 80 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ / +2 ఉత్తీర్ణులైనవారు వీటికి అర్హులు. మార్చి 2011కు ముందు ఇంటర్మీడియట్‌ / 10+2 ఉత్తీర్ణులైనవారు అర్హులు కాదు. అభ్యర్థులు 2011-12లో డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సులో చేరి ఉండాలి.

ఎంపికైన విద్యార్థులకు.... 
* డిగ్రీలో నెలకు రూ.1000 చొప్పున స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. 
* పీజీ కోర్సులకు నెలకు రూ.2000 లభిస్తుంది. 

మొత్తం స్కాలర్‌షిప్‌ వ్యవధి ఐదేళ్లు. డిగ్రీ మూడేళ్లు, పీజీ రెండేళ్లు స్కాలర్‌షిప్‌ పొందవచ్చు. ఒక విద్యాసంవత్సరంలో పదినెలలు స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.

ఎంపిక ఇంటర్మీడియట్‌ తర్వాత డిగ్రీ స్థాయిలో మాత్రమే జరుగుతుంది. డిగ్రీ పూర్తిచేశాక పీజీ కోర్సులకు స్కాలర్‌షిప్‌ దానంతటదే రెన్యువల్‌ అవుతుంది. ప్రొఫెషనల్‌ కోర్సులకు కూడా ఇవి వరిస్తాయి. ప్రభుత్వం గతంలో అమలుచేసిన నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ను మెరుగుపరచి రెండేళ్ల కిందట ఈ కొత్త స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు.

అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4.5 లక్షలకు మించరాదు. ఈ స్కీమ్‌ కింద ఆంధ్రప్రదేశ్‌కు 6097 స్కాలర్‌షిప్‌లు లభిస్తాయి.

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ చదివిన విద్యార్థులకు సైన్స్‌/ కామర్స్‌/ ఆర్ట్స్‌ స్ట్రీమ్‌లలో కటాఫ్‌లు (జనరల్‌ అభ్యర్థులకు) కింది విధంగా నిర్ణయించారు.
* సైన్స్‌ స్ట్రీమ్‌: అబ్బాయిలకు 967 మార్కులు, అమ్మాయిలకు 969  మార్కులు.
* కామర్స్‌ స్ట్రీమ్‌: అబ్బాయిలకు 882 మార్కులు, అమ్మాయిలకు 883 మార్కులు.
* హ్యుమానిటీస్‌ స్ట్రీమ్‌: అబ్బాయిలకు 690 మార్కులు, అమ్మాయిలకు 714 మార్కులు.

ఓబీసీ విద్యార్థులకు పరిగణనలోకి తీసుకునే కటాఫ్‌లు...
* సైన్స్‌ స్ట్రీమ్‌:  అబ్బాయిలకు 956 మార్కులు, అమ్మాయిలకు కూడా 956 మార్కులు.
* కామర్స్‌ స్ట్రీమ్‌:  అబ్బాయిలకు 824 మార్కులు, అమ్మాయిలకు 827 మార్కులు. 
* హ్యుమానిటీస్‌ స్ట్రీమ్‌: అబ్బాయిలకు 632 మార్కులు, అమ్మాయిలకు 654  మార్కులు

ఇంటర్మీడియట్‌లో మార్కుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థుల తాత్కాలిక జాబితాను ఆయా కాలేజీలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పంపిస్తుంది. విద్యార్థులు తమ తమ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపల్‌ వద్ద నుంచి సంబంధిత దరఖాస్తులను పొందవచ్చు.

బీఐఈఏపీ వెబ్‌సైట్‌ నుంచి కూడా దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఈ దరఖాస్తులను అన్ని వివరాలతో డిగ్రీ/ ప్రొఫెషనల్‌ కాలేజీల ద్వారా 'సెక్రటరీ, బీఐఈ, ఏపీ, నాంపల్లి, హైదరాబాద్‌' చిరునామాకు పంపించాలి.

ఇతర అభ్యర్థులు +2కు సంబంధించిన తమ బోర్డులను సంప్రదించాలి.

* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 30 సెప్టెంబరు 2011.
       

No comments:

Post a Comment