ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Thursday 18 August 2011

8 వ తరగతి నుంచి పీహెచ్ డీ వరకూ ఆర్థిక సహాయం!


'నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌' (ఎన్‌టీఎస్‌ఈ) !  

ఇది జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశపరీక్ష.  దీని ద్వారా ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేసి, వారికి  ఉపకార వేతనాలు (స్కాలర్ షిప్పులు)  అందిస్తారు. 


ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) వీటిని అందిస్తుంది. 


 ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన అభ్యర్థులకు ఎనిమిదో తరగతి నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసేవరకూ ప్రత్యేక సబ్జెక్టుల్లో ఆర్థిక సహాయం లభిస్తుంది.  


సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, మేనేజ్‌మెంట్‌, లా కోర్సులు చదివే అందరికీ ఈ స్కీమ్‌ వర్తిస్తుంది.


ఎన్‌టీఎస్‌ఈ-  2012  ప్రకటన  వెలువడింది! 

8వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎంపిక పరీక్ష రాయడానికి అర్హులు.


* ఆంధ్రప్రదేశ్‌లో చదువుతున్న విద్యార్థులు 'డిప్యూటీ కమిషనర్‌, డైరెక్టర్‌ ఫర్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ కార్యాలయం, చాపెల్‌ రోడ్‌, ఆబిడ్స్‌, హైదరాబాద్‌' నుంచి దరఖాస్తులు పొందవచ్చు.


ఎన్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌  చూడండి.


* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 ఆగస్టు 2011.


‘చదువు’ లో ప్రచురించిన ఈ  కథనం లో పూర్తి వివరాలు చదవొచ్చు. 
 

4 comments:

  1. డియర్ YS Nagaraju,
    మీకుపయోగపడే సూచనలూ, సమాచారం ఇవ్వాలన్నదే మా ఉద్దేశం. థాంక్యూ !

    ReplyDelete
  2. డియర్ సాయి,
    థాంక్యూ!

    ReplyDelete