ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 10 October 2011

ఐఐటీ బాటలో... తొలి మలుపు!

ఐటి-జెఇఇ 2012 నోటిఫికేషన్‌ విడుదలైంది.

గత ఏడాది ఐఐటి-జెఇఇ పేపర్‌ని పోల్చుకుంటూ సాధించాల్సిన మార్కులూ, దానికి అవసరమైన ప్రణాళికపై దృష్టి పెట్టే తరుణమిదే. ఐఐటీ బాటలో ఈ తొలి మలుపు విద్యార్థులు సాధించబోయే గెలుపునకు నాంది అంటున్నారు పి.వి.ఆర్.కె. మూర్తి !

ఈఏడాది ఐఐటీ- జేఈఈలో విశ్లేషణాత్మక ప్రశ్నలు ఉంటాయన్న ప్రచారం జరిగింది. దీంతో తాము రాయాల్సింది ఆబ్జెక్టివ్‌ పద్ధతిలోనా, కాదా అంటూ విద్యార్థుల్లో ఒక రకమైన ఉత్కంఠ ఏర్పడింది. అయితే పరీక్షా విధానం మారే అవకాశాలు లేవని నిపుణుల వాదన.


ఎందుకంటే... ప్రపంచంలోని అన్ని పోటీ పరీక్షలూ ఆబ్జెక్టివ్‌ విధానంలోకి మారుతున్నాయి. గతంలో ఐఐటి-జెఇఇ రాసే విద్యార్థుల సంఖ్య 50 వేల లోపే ఉండేది. కాబట్టి పేపర్లు దిద్దటం కష్టమయ్యేది కాదు. ఇప్పుడు 4-5 లక్షల మంది ఈ పరీక్ష రాస్తున్నారు. అన్ని పేపర్లు దిద్దడానికి కావలసిన నిపుణులు అందుబాటులో లేకపోవటం; సబ్జెక్టివ్‌ విధానంలో ఒక అధ్యాపకునికీ వేరొక అధ్యాపకునికీ పేపర్‌ దిద్దడంలో ఏర్పడే తేడా... వీటన్నిటి దృష్ట్యా ఐఐటి-జెఇఇ 2012 పేపరు ఆబ్జెక్టివ్‌ విధానంలోనే గత సంవత్సరం మాదిరే వెలువడనున్నదని విద్యావేత్తల అంచనా.

మార్పులేమిటి?
2011తో పోల్చుకుంటే 2012లో జరిగిన ముఖ్య మార్పులు...

*  ఐఐటి-జెఇఇ దరఖాస్తు ఫారం వెల గత సంవత్సరంతో పోలిస్తే పెరిగింది- రూ. 1,000 నుంచి రూ. 1,800కు! ఒకవేళ విద్యార్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే రూ. 1,600 అవుతుంది.

*  బాలికలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దరఖాస్తు రుసుమును వారికి మినహాయించారు. అంటే బాలికలందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

*  ఓఆర్‌ (ఆప్టిక్‌ రెస్పాన్స్‌) షీట్లలో గత సంవత్సరం వరకూ పెన్సిల్‌తోనే మార్కు చేయించేవారు. కానీ ఈ ఏడాది పెన్‌తో చేయాల్సి ఉంటుంది.

*  పరీక్షలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో చేసిన మార్పు- పరీక్ష అయిన వెంటనే విద్యార్థి ప్రశ్నపత్రంతో పాటు జవాబులు గుర్తించిన ఓఆర్‌ఎస్‌ పేపరు కూడా తీసుకువెళ్లవచ్చు. దీనివల్ల విద్యార్థులు 'కీ' ప్రకటించిన వెంటనే ఎన్ని మార్కులు వస్తాయో నిర్థారణకు రావచ్చు.

*  పరీక్ష జరిగిన 20 రోజులలోపు సరైన జవాబుల కీ విడుదలవుతుంది.

ఇవీ స్థూలంగా ఈ ఏడాది జరిగిన మార్పులు. ఇవి తప్ప మిగిలినవన్నీ 2011లో ఐఐటి-జెఇఇలో మాదిరే ఉంటాయి.
2012లో జరిగే పరీక్ష కూడా ఏప్రిల్‌ 8వ తేదీ ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. ఈ రెండు పరీక్షల్లో ఏ సబ్జెక్టు ముందు ఇస్తారు; ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? అనేది విద్యార్థి పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం తెరిచిన తరవాత మాత్రమే అర్థమవుతుంది. పరీక్షాపత్రం ఎలా ఉన్నా విద్యార్థి రాయడానికి తయారై వెళ్లవలసి ఉంటుంది.

2011లో పేపరును విశ్లేషించుకుంటే విద్యార్థికి ప్రిపరేషన్‌ ప్రణాళిక సులభమవుతుంది. 2011లో జరిగిన ఐఐటి-జెఇఇ పరీక్షకు 131 నగరాల్లో 1051 సెంటర్లలో 4,85,562 మంది విద్యార్థులు రిజిస్టరు చేసుకున్నారు.

2011లోని పేపర్‌లో మొత్తం పది రకాలైన ప్రశ్నల్లో రెండు పేపర్లలోనూ కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌ వరుసలో పేపర్లు ఇచ్చారు.

*  మొదటి పేపర్‌లో ప్రతి సబ్జెక్టులో 23 ప్రశ్నలతో మొత్తం 69 ప్రశ్నలు, 240 మార్కులకు ఇచ్చారు. అన్ని సబ్జెక్టుల్లోనూ ప్రశ్నలది ఒకే క్రమం.






ఈ పేపర్లో రుణాత్మక మార్కులు 24 మాత్రమే. 56 మార్కులకు నెగెటివ్‌ మార్కులు లేవు. అంటే పేపరు 1, 2లను కలిపిచూస్తే 100 మార్కుల వరకూ రుణాత్మక మార్కులు లేవు. 62.5 శాతం ప్రశ్నలు విద్యార్థులకు జవాబులు తెలియకపోయినా ఛాన్స్‌ తీసుకునే అవకాశం ఏర్పడింది. '2011లో పేపరు బాగా తేలికగా వచ్చింది' అని చెప్పుకోవడానికి కారణమిదే.

ఇంతవరకు జరిగిన ఐఐటి-జెఇఇల్లో తొలిసారి 2011 పేపరులో మల్టిపుల్‌ ఆన్సర్‌ టైప్‌, ఇంటెజర్‌ ఆన్సర్‌ టైప్‌, మ్యాట్రిక్స్‌ మ్యాచింగ్‌ తరహా ఒకే పేపరులో ఇచ్చారు. అంటే విద్యార్థి ఎక్కువగా ఇబ్బంది పడే ఈ మూడు రకాల ప్రశ్నలను ఒకే ప్రశ్నపత్రంలో ఇచ్చారు. పేపరు-1తో పోల్చుకుంటే పేపరు-2 కొంత క్లిష్టంగా ఉందని నిపుణుల అభిప్రాయం.

No comments:

Post a Comment