ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Friday 14 October 2011

మేనేజ్‌మెంట్‌ విద్యకు 'మ్యాట్‌'



ఆంధ్రప్రదేశ్‌లో బద్రుకా గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌, గీతం యూనివర్సిటీ, ఏసియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ధ్రువ కాలేజ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఐసీబీఎం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌, ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌, విజ్ఞాన జ్యోతి ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్  తదితర సంస్థలు మ్యాట్‌ స్కోరు ఆధారంగా మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కల్పిస్తున్నాయి.

మ్యాట్‌ స్కోరు ఆధారంగా ప్రవేశం లభించే ప్రోగ్రామ్‌లకు ఏఐసీటీఈ లేదా యూజీసీ గుర్తింపు ఉంటుంది. ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న బిజినెస్‌ స్కూళ్లు సాధారణంగా పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం) అందిస్తాయి. యూనివర్సిటీలు ఎంబీఏ పేరుతో మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తాయి.

దేశవ్యాప్తంగా మ్యాట్‌ స్కోరును ఆమోదించే వివిధ రకాల మేనేజ్‌మెంట్‌ సంస్థల జాబితా ఏఐఎంఏ వెబ్‌సైట్‌లో లభిస్తుంది.

మ్యాట్‌ను దేశవ్యాప్తంగా 70కిపైగా పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు.

మనరాష్ట్రంలో హైదరాబాద్‌, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలున్నాయి. ఏటా మ్యాట్‌ పరీక్షను దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. డిసెంబరు, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించే పరీక్షకు పోటీ ఎక్కువగా ఉంటుంది. మ్యాట్‌ను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో రాయవచ్చు.

మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలు మ్యాట్‌ స్కోరు ఆధారంగా అభ్యర్థులను వడపోత పోస్తాయి. తర్వాత గ్రూప్‌ డిస్కషన్‌లు, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తాయి. మ్యాట్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తోన్న సంస్థల్లో ఫీజులు సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉండొచ్చు.

మంచి స్కోరు రావాలంటే..?
మ్యాట్‌ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో సాధించే స్కోరును ర్యాంకులకు పరిగణనలోకి తీసుకోరు. ఈ ప్రశ్నలు కాకుండా మిగిలిన 160 ప్రశ్నలకు 70 నుంచి 80 మార్కులు సాధిస్తే మ్యాట్‌లో మంచి స్కోరు తెచ్చుకోవచ్చు.

మ్యాట్‌ స్కోరుకు ఒక ఏడాది వరకు విలువ ఉంటుంది. అభ్యర్థులు మ్యాట్‌కు దరఖాస్తు చేసుకునేటప్పుడు తమకు ఇష్టమైన ఏవైనా 5 సంస్థలను ఎంచుకోవాలి. సైన్స్‌, ఆర్ట్స్‌, కామర్స్‌, మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, తదితర గ్రాడ్యుయేట్లు, ఆయా కోర్సులు చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు మ్యాట్‌ రాయవచ్చు.

* అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న బిజినెస్‌ స్కూళ్లకు అవసరమైన ఇతర అర్హతలు, నిబంధనలకు లోబడి మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.

పరీక్ష విధానం ఎలా?
మ్యాట్‌ ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటుంది. ఆన్‌లైన్‌ పద్ధతిలో లేదా పేపర్‌- పెన్సిల్‌ పద్ధతిలో పరీక్ష రాయవచ్చు. మ్యాట్‌లో మొత్తం 5 విభాగాలుంటాయి. అవి... లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, గణిత సామర్థ్యం, డేటా ఎనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీ, ఇంటెలిజన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌, ఇండియా అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌. ఆయా విభాగాల్లో కింది అంశాల నుంచి ప్రశ్నలడిగే అవకాశం ఉంటుంది...
* లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌:
ఇందులో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, ఒకాబ్యులరీ, ఖాళీలు పూరించడం, సమానార్థాలు, వ్యాకరణం తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేరాగ్రాఫ్‌ పూర్తిచేయడం, పేరాగ్రాఫ్‌ జంబ్లింగ్‌, వాక్యాల్లో దోషాలను గుర్తించి సరిచేయడం, వాక్యాలను పూరించడం, వ్యతిరేక అర్థాలనిచ్చే పదాలు కనుక్కోవడం కూడా ముఖ్యమైన అంశాలు. రోజూ దినపత్రికలను చదవడం, ప్యాసేజ్‌లను సాధన చేయడం ద్వారా ఇందులో మంచి స్కోరు తెచ్చుకోవచ్చు. జనరల్‌ అవేర్‌నెస్‌కు కూడా ఈ సాధన ఉపయోగపడుతుంది.

* గణిత సామర్థ్యాలు:
ఈ విభాగంలో మేథమేటిక్స్‌లోని ప్రాథమిక అంశాలైన అర్థమెటిక్‌, జామెట్రీ, మెన్సురేషన్‌, కాలం-దూరం, కాలం-వేగం, బారువడ్డీ, చక్రవడ్డీ, సీరీస్‌, సెట్‌ థియరీ, తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. హయ్యర్‌ మేథమేటిక్స్‌లో ప్రాబబిలిటీ, పెర్ముటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌ చదవడం మంచిది.

* డేటా ఎనాలసిస్‌ అండ్‌ సఫిషియన్సీ:
సమాచారం ఆధారంగా ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ విభాగంలో పట్టికలు, చార్టులు, లైన్‌ గ్రాఫ్‌లు, పై చార్టులు, డేటా సఫిషియన్సీ, కాంబినేషనల్‌ గ్రాఫ్‌, బార్‌ గ్రాఫ్‌, తదితర అంశాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి.

* ఇంటెలిజన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌:
ఇందులో ముఖ్యమైన అంశాలు... డేటా అరేంజ్‌మెంట్‌, ఇన్‌పుట్‌- అవుట్‌పుట్‌ టైప్‌, క్రిటికల్‌ రీజనింగ్‌, రక్త సంబంధాలు, సీరీస్‌ పూర్తిచేయడం, కోడింగ్‌- డీకోడింగ్‌, వాదనలు, లెటర్‌ సీక్వెన్స్‌, నంబర్‌ సీక్వెన్స్‌, ఎనాలజీస్‌.

* ఇండియా అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌:
మేనేజ్‌మెంట్‌ అభ్యర్థులకు అవసరమైన జనరల్‌ అవేర్‌నెస్‌ను ఈ విభాగం ద్వారా పరీక్షిస్తారు. ఇందులో సైన్స్‌, జాగ్రఫీ, చరిత్ర, ఎకనమిక్స్‌, కరెంట్‌ అఫైర్స్‌, రాజకీయ వ్యవస్థ, తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. దీన్ని ఫైనల్‌ స్కోరుకు పరిగణనలోకి తీసుకోకున్నా, కొన్ని సంస్థలు ప్రవేశాలకు సెక్షన్ల వారీగా స్కోర్లను పరిశీలిస్తాయి. అందువల్ల ఈ విభాగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

దరఖాస్తు విధానం...
* మ్యాట్‌ డిసెంబరు 2011 నోటిఫికేషన్‌ వెలువడింది. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐఎంఏ స్టడీ సెంటర్ల నుంచి కూడా దరఖాస్తులు పొందవచ్చు.

* హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శాఖల్లో; అనంతపురం, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, తిరుపతిలోని యాక్సిస్‌ బ్యాంకు శాఖల్లో కూడా దరఖాస్తులు లభిస్తాయి. పూర్తి వివరాలు ఏఐఎంఏ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 12 నవంబరు 2011

* పూర్తిచేసిన దరఖాస్తులు ఏఐఎంఏ, న్యూఢిల్లీకి చేరడానికి చివరితేదీ: 15 నవంబరు 2011.

* మ్యాట్‌ డిసెంబరు 2011 పరీక్ష తేదీ: 4 డిసెంబరు 2011 (పేపర్‌ పరీక్ష); 10 డిసెంబరు 2011 (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష).

No comments:

Post a Comment