ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Friday 11 November 2011

పెట్రోలియం మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ

పెట్రోలియం, ఎనర్జీ స్పెషలైజేషన్‌లతో వివిధ ప్రొఫెషనల్‌ కోర్సులను అందిస్తోన్న సంస్థ.. రాజీవ్‌గాంధీ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ).

రాయ్‌బరేలీ (ఉత్తరప్రదేశ్‌)లోని ఈ సంస్థ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోంది.

ఇందులో పెట్రోలియం అండ్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ చేయవచ్చు. ఈ సంస్థ అత్యున్నత ప్రమాణాలతో మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది.

ఎంబీఏ (పెట్రోలియం అండ్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌)లో సీట్ల సంఖ్య 50.

టెన్త్‌, ఇంటర్‌లో మేథ్స్‌ సబ్జెక్టుతో కనీసం 60 శాతం మార్కులు అవసరం.
ఏదైనా బ్రాంచిలో బీటెక్‌ 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
వీటితోపాటు క్యాట్‌ 2011 / జీమ్యాట్‌ 2011 (జూన్‌ 2011 తర్వాత) స్కోరు అవసరం.
వీటి ఆధారంగా అభ్యర్థులను గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
ఎంపికలో అభ్యర్థుల అకడమిక్‌ రికార్డును కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

కొన్ని సీట్లు స్పాన్సర్డ్‌ అభ్యర్థులకు కేటాయిస్తారు. ఈ అభ్యర్థులకు బీటెక్‌లో కనీసం 65 శాతం మార్కులు, రెండేళ్ల పని అనుభవం అవసరం. క్యాట్‌, జీమ్యాట్‌ స్కోర్లు అవసరం లేదు. గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆర్‌జీఐపీటీలో ఎంబీఏ చేసిన అభ్యర్థులకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌, తదితర ప్రభుత్వ రంగ కంపెనీలు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాయి. వీటితోపాటు కెయిర్న్‌ ఇండియా, హెచ్‌పీసీఎల్‌ - మిట్టల్‌ ఎనర్జీ లిమిటెడ్‌, యాక్సెంచూర్‌ సర్వీసెస్‌, భారత్‌- ఒమన్‌ రిఫైనరీస్‌, తదితర కంపెనీలు ప్లేస్‌మెంట్లు కల్పిస్తున్నాయి.

* ఆర్‌జీఐపీటీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తుల ప్రింట్లను సంబంధిత సర్టిఫికెట్‌ కాపీలతో పంపాలి. ఫీజు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తులు చేరడానికి చివరితేదీ  5 డిసెంబరు 2011.

No comments:

Post a Comment