ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Friday 16 September 2011

రెండేళ్ళలో ఎంటెక్, ఎంఎస్సీ!

ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు జేఎన్‌టీయూ కాకినాడ, బీటీహెచ్‌ (స్వీడన్‌) సంయుక్తంగా డబుల్‌ డిగ్రీ పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (సిగ్నల్‌ ప్రాసెసింగ్‌) కోర్సును అందిస్తున్నాయి.

దీని ద్వారా రెండేళ్లలో ఎం.టెక్‌., ఎం.ఎస్‌సి. డిగ్రీలు అందుకోవచ్చు.

వీటిలో...
 

* ఎంటెక్‌ డిగ్రీని జేఎన్‌టీయూ కాకినాడ,
* ఎం.ఎస్‌సి.ని బీటీహెచ్‌ ప్రదానం చేస్తాయి.


జేఎన్‌టీయూకే - బీటీహెచ్‌ అందిస్తోన్న ఈ కోర్సులో మొత్తం సీట్లు 10. విదేశాల్లో ఉన్నత విద్య, మంచి ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని కోర్సును రూపొందించారు.

కోర్సు వ్యవధి 4 సెమిస్టర్లు (24 నెలలు). అభ్యర్థులు బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ/ ఏఎంఐఈటీఈ చదివుండాలి. ఈసీఈ, ఈఐఈ, ఏఎంఐఈ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌), ఏఎంఐఈటీ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలిమేటిక్స్‌ ఇంజినీరింగ్‌) బ్రాంచిలు చదివుండాలి.

* అర్హత పరీక్షలో కనీసం 55 శాతం మార్కులు అవసరం. కోర్సులో భాగంగా సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ పేపర్‌ చదివుండాలి.

 కోర్సు ఫీజు రూ.1,50,000.

*  అభ్యర్థులు మొదటి సెమిస్టర్‌ మాత్రమే జేఎన్‌టీయూలో చదవాల్సి ఉంటుంది. మిగిలిన మూడేళ్లు బీటీహెచ్‌, స్వీడన్‌లో చదవాలి. చివరి సెమిస్టర్‌లో థీసిస్‌ వర్క్‌ ఉంటుంది.

* దరఖాస్తులను జేఎన్‌టీయూ కాకినాడ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

అభ్యర్థులను కౌన్సెలింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 17 సెప్టెంబరు 2011.

* కౌన్సెలింగ్‌ తేదీ: 19 సెప్టెంబరు 2011

No comments:

Post a Comment