ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday 6 September 2011

ఫీజు లేకుండా... ఐఐఎంలో కోర్సు!

మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌లో ఉన్నత స్థాయి కోర్సులవైపు అభ్యర్థులను ఆకర్షించడానికి ఐఐఎంలు ప్రయత్నిస్తున్నాయి.

దీనికోసం ఫీజులు లేకుండా, ఆకర్షణీయమైన స్టయిపెండ్‌ అందిస్తూ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక స్పెషలైజేషన్లతో ఫెలో ప్రోగ్రామ్‌లను రూపొందిస్తున్నాయి.

మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌లో పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థులకు ఐఐఎం ఇండోర్‌ ప్రారంభించిన ఫెలో ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌పీఎం) సరైన కోర్సు.  

ఈ డిగ్రీ పీహెచ్‌డీతో సమానం.

ఐఐఎం ఇండోర్‌ నిర్వహిస్తోన్న ఎఫ్‌పీఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందినవారికి అనేక సౌకర్యాలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. కోర్సులో చేరిన అందరికీ మొదటి రెండేళ్లు నెలకు రూ.15000 చొప్పున స్టయిపెండ్‌ ఇస్తారు. తర్వాతి రెండేళ్లు నెలకు రూ.20000 చొప్పున స్టయిపెండ్‌ లభిస్తుంది. వీటితోపాటు పుస్తకాలు, ఇతర ఖర్చుల కింద ఏటా రూ.25000 లభిస్తుంది.

కోర్సు మొదటి నాలుగేళ్లకు ఎలాంటి ట్యూషన్‌ ఫీజూ ఉండదు. ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. ఇన్ని సౌకర్యాలతో ఐఐఎంలో చదివే అవకాశం అందుబాటులో ఉంది.

ఇప్పటికే కంపెనీల్లో వివిధ స్థాయుల్లో పనిచేస్తోన్న మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌ను శిక్షణ, పరిశోధన, కన్సల్టింగ్‌ రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దడం ఐఐఎం ఇండోర్‌ అందిస్తోన్న ఎఫ్‌.పి.ఎం. (ఇండస్ట్రీ) ప్రోగ్రామ్‌ ప్రధాన లక్ష్యం. ఆధునిక పరిశోధన అంశాలు, బోధన పద్ధతుల ద్వారా ఇందులో శిక్షణ లభిస్తుంది.

అభ్యర్థులు వారి పని అనుభవం, విద్యా నేపధ్యాన్ని బట్టి కింది స్పెషలైజేషన్లను ఎంచుకోవచ్చు...

* జనరల్‌ మేనేజ్‌మెంట్‌ - కమ్యూనికేషన్‌
* ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌
* ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌
* ఫైనాన్షియల్‌ ఎకనమిక్స్‌
* మార్కెటింగ్‌
* ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ అండ్‌ హెచ్‌.ఆర్‌.ఎం.
* ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌
* స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌

కోర్సు స్వరూపం
ఎఫ్‌పీఎం వ్యవధి నాలుగు నుంచి నాలుగున్నరేళ్ల వరకు ఉంటుంది. కోర్సు మొత్తం నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి ఏడాది కోర్సు వర్క్‌ ఉంటుంది. ఇది ఐఐఎం ఇండోర్‌ నిర్వహిస్తోన్న పీజీపీ ప్రోగ్రామ్‌తో సమాన స్థాయిలో ఉంటుంది. రెండో ఏడాది నుంచి అభ్యర్థి ఎంచుకున్న స్పెషలైజేషన్‌లో శిక్షణ ఇస్తారు. అంతేగాక పరిశోధనలకు అవసరమైన రిసెర్చ్‌ మెథడాలజీ, అకడమిక్‌ అంశాలపై అవగాహన కల్పిస్తారు. రెండేళ్ల తర్వాత అభ్యర్థులు తమ స్పెషలైజేషన్లకు సంబంధించిన పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు థీసిస్‌ రాయాలి. ఇది పూర్తిచేస్తే డాక్టొరేట్‌ లభిస్తుంది.

అర్హతలు, ప్రవేశం
మొదటి నుంచి మంచి అకడమిక్‌ రికార్డు ఉన్న అభ్యర్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యం లభిస్తుంది. అభ్యర్థులు ఏదైనా సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసుండాలి. సీఏ, సీడబ్ల్యుఏ, సీఎస్‌ పూర్తిచేసిన వారు కూడా అర్హులు. వీరికి కనీసం 55 శాతం మార్కులు అవసరం. 60 శాతం మార్కులున్న బీఈ/ బీటెక్‌ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీఏ/ సీడబ్ల్యుఏ, సీఎస్‌/ బీటెక్‌, తదితర ప్రొఫెషనల్‌ కోర్సులు చేసిన అభ్యర్థులకు మేనేజ్‌మెంట్‌ రంగంలో కనీసం రెండేళ్ళ అనుభవం అవసరం.

అభ్యర్థులకు క్యాట్‌/ జీమ్యాట్‌/ జీఆర్‌ఈ స్కోరు అవసరం.
ఇవేవీ లేకపోతే ఐఐఎం ఇండోర్‌ నిర్వహించే రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ రాయాలి.
గుర్తింపు పొందిన కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ అధ్యాపకులుగా మూడేళ్లు అనుభవం ఉన్నవారిని నేరుగా ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
సీఎస్‌ఐఆర్‌- యూజీసీ జేఆర్‌ఎఫ్‌ ఉన్నవారు కూడా పరీక్ష రాయాల్సిన అవసరం లేదు.

* ఐఐఎం ఇండోర్‌ వెబ్‌సైట్‌  నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తులు చేరడానికి చివరితేదీ : 20 జనవరి 2012.

No comments:

Post a Comment