ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Friday 30 September 2011

ఆంధ్ర మహిళా సభలో పీజీ డిప్లొమా, టీపీటీ

హైదరాబాద్‌లోని ఆంధ్ర మహిళా సభ (ఏఎంఎస్‌) ఆధ్వర్యంలో కొనసాగుతోన్న కాలేజ్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ వివిధ జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సులను అందిస్తోంది.

2011-12 సంవత్సరానికి పీజీ డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేషన్‌, తెలుగు పండిట్‌ ట్రైనింగ్‌ (టీపీటీ) కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ కోర్సులకు అర్హులు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధ కళాశాలగా ఏఎంఎస్‌ కొనసాగుతోంది.

* పీజీ డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేషన్‌: అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సులకు ఎన్‌సీటీఈ గుర్తింపు ఉంది.

* తెలుగు పండిట్‌ ట్రైనింగ్‌: తెలుగు ఆప్షనల్‌ సబ్జెక్టుగా బీఏ లేదా ఎం.ఎ. తెలుగు లేదా బీఏ లాంగ్వేజెస్‌ చదివుండాలి.

ఈ కోర్సులకు సంబంధించిన ఇతర వివరాలు, దరఖాస్తులను ఏఎంఎస్‌ కార్యాలయం నుంచి పొందవచ్చు.

చిరునామా: కాలేజ్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌, ఆంధ్ర మహిళా సభ, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌ రోడ్‌, హైదరాబాద్‌.

వీటితోపాటు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులకు అనేక పారామెడికల్‌ కోర్సులను కూడా ఏఎంఎస్‌ అందిస్తోంది. వీటి వ్యవధి రెండేళ్లు. మేనేజ్‌మెంట్‌ కోటాలో కింది పారామెడికల్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఏఎంఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది...
* రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్‌
* పెర్‌ఫ్యూజన్‌ టెక్నీషియన్‌
* ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌
* క్యాథ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌


ఈ కోర్సులకు ఇంటర్మీడియట్‌ బైపీసీ లేదా ఎంపీసీ గ్రూప్‌లు చదివిన అభ్యర్థులు అర్హులు. బైపీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు.

వీటితోపాటు ఏడాది వ్యవధి గల 'ఈసీజీ టెక్నీషియన్‌'  కోర్సును కూడా అందిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులు దీనికి అర్హులు.

దరఖాస్తులను ఏఎంఎస్‌, డి.డి. కాలేజ్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ, విద్యానగర్‌, హైదరాబాద్‌ నుంచి పొందవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ  30 సెప్టెంబరు 2011.

No comments:

Post a Comment